కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ పండంటి బిడ్డను ప్రసవించింది.
గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ పండంటి బిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు... గూడూరుకు చెందిన బోయ సరోజ(30) నిండు గర్భిణి. రెగ్యులర్ చెకప్ కోసం కర్నూలు ఆస్పత్రికి వెళ్లింది. కాన్పు కావడానికి ఇంకా వారం రోజులు పడుతుందని అక్కడి వైద్యులు చెప్పడంతో.. సరోజ ఆర్టీసీ బస్సులో తిరిగి గూడూరుకు బయలుదేరింది. బస్సు గూడూరు శివారుకు వచ్చేటప్పటికి ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు బస్సులోనే కాన్పు చేశారు. మగ బిడ్డ పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.