కొడుకుతో కలిసి భర్తను హతమార్చింది | wife meeramma kills her husband | Sakshi
Sakshi News home page

కొడుకుతో కలిసి భర్తను హతమార్చింది

Oct 5 2015 8:46 AM | Updated on Sep 3 2017 10:29 AM

మధిర పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది.

ఖమ్మం(మధిర): మధిర పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మీరమ్మ అనే మహిళ తన కుమారుడితో కలిసి భర్త రాళ్లకంటి ప్రకాశరావు(55)ను రోకలి బండతో మోది పాశవికంగా హత్యచేసింది. భార్య, కుమారుని దాడిలో భర్త అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement