మడ్డువలస గేట్లు ఎత్తివేత | water flows | Sakshi
Sakshi News home page

మడ్డువలస గేట్లు ఎత్తివేత

Sep 12 2016 11:39 PM | Updated on Sep 4 2017 1:13 PM

నీటిని విడిచిపెడుతున్న దృశ్యం

నీటిని విడిచిపెడుతున్న దృశ్యం

మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం నాలుగుగేట్లు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో నీటిప్రవాహం భారీగా పెరిగింది. దీంతో 9 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు వద్ద 64.25 మీటర్ల లెవెల్‌ నీటిమట్టం నమోదైంది.

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం నాలుగుగేట్లు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో నీటిప్రవాహం భారీగా పెరిగింది. దీంతో 9 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు వద్ద 64.25 మీటర్ల లెవెల్‌ నీటిమట్టం నమోదైంది. దీంతో ప్రాజెక్టు వద్ద నాలుగే గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నామని డీఈ జి.పద్మజ సాక్షికి తెలిపారు. వరద ఉద్ధృతి పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని మళ్లిస్తామని ఆమె తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement