మడ్డువలస ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత | madduvalasa project gates lifted in srikakulam district | Sakshi
Sakshi News home page

మడ్డువలస ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

Sep 16 2015 5:34 PM | Updated on Sep 3 2017 9:31 AM

శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉన్న మడ్డువలస ప్రాజెక్టు గేట్లను బుధవారం సాయంత్రం మరింత ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

వంగర(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉన్న మడ్డువలస ప్రాజెక్టు గేట్లను బుధవారం సాయంత్రం మరింత ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వేగావతి, సువర్ణముఖి నదులపై ఉన్న ఈ ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నిండిపోయింది. మంగళవారం ప్రాజెక్టుకు ఉన్న 11 గేట్లలో నాలుగింటిని ఎత్తి ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బుధవారం అదే నాలుగు గేట్లను మరో రెండు మీటర్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement