'బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు' | UV Krishnam raju takes on tdp leaders | Sakshi
Sakshi News home page

'బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు'

Feb 27 2016 2:03 PM | Updated on Mar 29 2019 9:07 PM

'బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు' - Sakshi

'బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు'

టీడీపీపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి యు.వి.కృష్ణంరాజు శనివారం కాకినాడలో నిప్పులు చెరిగారు.

కాకినాడ : టీడీపీపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి యు.వి.కృష్ణంరాజు శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిప్పులు చెరిగారు. బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయకుండా టీడీపీ అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. క్షమశిక్షణ గల బీజేపీ కార్యకర్తలు టీడీపీ చర్యలను సహిస్తున్నారని తెలిపారు. టీడీపీ చర్యలను బయటకు చెప్పుకోలేక తమ పార్టీ నేతలు బాధపడుతున్నారని కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీతోని పైస్థాయి నాయకులు మాత్రమే టీడీపీతో కలసి ఉండాలని భావిస్తున్నారని చెప్పారు. ఇరు పార్టీల మధ్య చోటు చేసుకున్న ఈ వ్యవహారం గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు వెళ్లకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశంతో సమన్వయం చేయాలని భావిస్తున్నామన్నారు. ఎన్నికలు వస్తే బీజేపీ సొంతంగా నిలబడగల స్థితి రావాలనే ప్రయత్నం చేస్తున్నామని కృష్ణంరాజు తన మనసులోని మాట చెప్పారు.ఆ నిర్ణయం త్వరలోనే వస్తుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement