అల్ట్రాటెక్‌ ఉద్యోగి ఆత్మహత్య | ultratech employee suicides | Sakshi
Sakshi News home page

అల్ట్రాటెక్‌ ఉద్యోగి ఆత్మహత్య

Nov 6 2016 12:02 AM | Updated on Nov 6 2018 8:28 PM

తాడిపత్రి మండలంలోని గదరగుట్టపల్లి గ్రామానికి చెందిన దస్తగిరి(37) శనివారం ఒంటిపై కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి మండలంలోని గదరగుట్టపల్లి గ్రామానికి చెందిన దస్తగిరి(37) శనివారం ఒంటిపై కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో పనిచేస్తున్న అతడు కొన్ని నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ బాధ భరించలేక ఇంట్లో కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే గాయపడిన అతడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య వహీదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement