భీమా ఫేజ్‌–2 పంప్‌హౌస్‌ ట్రయల్‌రన్‌ | traialrun the bheema phase-2 pumphouse | Sakshi
Sakshi News home page

భీమా ఫేజ్‌–2 పంప్‌హౌస్‌ ట్రయల్‌రన్‌

Jul 26 2016 11:44 PM | Updated on Sep 4 2017 6:24 AM

మక్తల్‌ : పట్టణ సమీపంలోని భీమా ఫేజ్‌–2 పంప్‌హౌస్‌ను మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సందర్శించారు. రెండోసారి ట్రయల్‌రన్‌ చేశారు. పంప్‌హౌస్‌ నుంచి మోటార్‌ను ప్రారంభించిన అనంతరం సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని వదిలారు.

మక్తల్‌ : పట్టణ సమీపంలోని భీమా ఫేజ్‌–2 పంప్‌హౌస్‌ను మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సందర్శించారు. రెండోసారి ట్రయల్‌రన్‌ చేశారు. పంప్‌హౌస్‌ నుంచి మోటార్‌ను ప్రారంభించిన అనంతరం సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని వదిలారు. రిజర్వాయర్‌ వరకు ఎమ్మెల్యే కాల్వ వెంబడి వెళ్లి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా.. అని పరిశీలించారు. ఆయన మాట్లాడూతూ నియోజకవర్గంలో అన్ని మండలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రారంభిస్తామని, రైతులకు పుష్కలంగా సాగునీరు వస్తుందని అన్నారు. ఖరీఫ్‌లో సాగునీరు పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. భీమా పంప్‌హౌస్‌ నుంచి కాల్వ వెంబడి నీళ్లు రావడంతో మక్తల్‌ పట్టణ ప్రజలు నీటిని చూసేందుకు బారీగా తరలివస్తున్నారు. ఎమ్మెల్యే వెంట మక్తల్‌ టీఆర్‌ఎస్‌ ఇ¯Œæచార్జ్‌ దేవరిమల్లప్ప, సీఈ ఖగేందర్, ఎస్‌ఈ భద్రయ్య, డీఈ నాగిరెడ్డి, ఈఈ  వీరేశం, నాయకులు గోపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బాల్‌రాంరెడ్డి, గుర్నాథ్‌రెడ్డి, శివారెడ్డి తదితరులు ఉన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement