నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ కోతలు విధించనున్నట్లు ఆపరేషన్స్ డీఈ పీవీ రమేష్, టౌన్ ఏడీఈ-2 జి. రంగస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు నగరంలో విద్యుత్ కోతలు
Feb 3 2017 12:37 AM | Updated on Sep 5 2017 2:44 AM
కర్నూలు(రాజ్విహార్): నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ కోతలు విధించనున్నట్లు ఆపరేషన్స్ డీఈ పీవీ రమేష్, టౌన్ ఏడీఈ-2 జి. రంగస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శరీన్ నగర్ ఏరియా విద్యుత్ ఫీడర్లో మరమ్మతుల కారణంగా శరీన్ నగర్, గట్టయ్య నగర్, రాఘవేంద్ర నగర్, శరీఫ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement