డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనవర్సిటీ పరీక్షల గడువు పొడిగించారు.
నల్లగొండ: డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనవర్సిటీ పరీక్షల గడువు పొడిగించారు. ఎలాంటి విద్యార్హత లేకుండా డిగ్రీలో చేరేందుకు, బీఈడీ ప్రవేశానికి ఆగస్టు 6వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు రీజియన్ కోఆర్డినేటర్ ధర్మానాయక్ తెలిపారు. ఈ రెండు పరీక్షలు ఆగస్టు 14వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. పీజీ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 2 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.