అబ్దుల్లాపూర్మేట్ మండలం తుర్కయాంజాల్లోని ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది.
అబ్దుల్లాపూర్మేట్(రంగారెడ్డి జిల్లా): అబ్దుల్లాపూర్మేట్ మండలం తుర్కయాంజాల్లోని ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో సుమారు రూ.2.35 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలను దొంగలు అపహరించారు.
బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ జరిగిన నివాసాన్ని పరిశీలించారు. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.