ఇద్దరి మధ్య ఘర్షణ.. | The confrontation between the two | Sakshi
Sakshi News home page

ఇద్దరి మధ్య ఘర్షణ..

Sep 27 2016 2:27 PM | Updated on Sep 4 2017 3:14 PM

పోడూరు మండలం కవిటంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది.

-  లారీ కిందపడి మృతి
పోడూరు(పశ్చిమగోదావరి జిల్లా)

 పోడూరు మండలం కవిటంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చుట్టగుల్ల శ్రీను, తాడిపత్రి స్వామి(45) అనే ఇద్దరు వ్యక్తులు ఓ విషయంలో ఘర్షణ పడ్డారు. కోపంతో శ్రీను, స్వామిని తోసేయడంతో అదుపుతప్పి వెనకాలే వస్తున్న ఓ లారీ కిందపడ్డాడు. ముందు చక్రాలు అతనిపై వెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement