బ్యాంకు ఖాతాలో రూ. 2.50 లక్షల జమ చేయాలని మెసేజ్!
సొమ్ము జమచేసి ఆఖరి నిమిషంలో మేల్కొన్న ఓ ఎమ్మెల్యే?
కాకినాడ : నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఆర్థిక శాఖలో కార్యదర్శులకు నేనే మీడియేటర్ని. వర్క్స్ ఇప్పిస్తుంటా. మీ నియోజకవర్గానికి రూ.2.80 కోట్లు ప్రత్యేక గ్రాంట్గా ఇప్పిస్తా. ఇందుకోసం రూ. 2.5 లక్షలు సిద్ధం చేసుకోండి. మీ ఖాతాలో ఉంచుకొండి. మీ జిల్లాలో ఎమ్మెల్యేలందరికీ చెప్పా. అందరూ ఓకే చెప్పారు. మీరే ఆలస్యం...
- ఇదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి కాకినాడకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్!
మీరు ఖాతాలో రూ.2.5 లక్షలు వేశారా? అయితే రేపటి నుంచి బ్యాంకులకు సెలవులు. ప్రాసెసింగ్కు లేట్ అయిపోతోంది. బాస్ ఇమీడియట్గా డబ్బులు కావాలంటున్నారు. ఒక ఖాతా నంబరు మెసేజ్ చేస్తా. అందులో జమ చేయండి. ఎలాగూ బ్యాంకు ఖాతానే కాబట్టి మీరు సందేహించాల్సిన అవసరం లేదు...
- ఇదీ మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ అదే వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్! దీంతో హడావుడిగా సదరు ఎమ్మెల్యే ఆ అపరిచితుడు మెసేజ్ పంపిన ఖాతా నంబరులో రూ. 2.5 లక్షలు జమ చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...ఆ అపరిచితుడు రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశాడు. వారిలో ఎక్కువ మంది రూరల్ ఏరియాకు చెందినవారే. తొలుత సొంత ఖాతాలో జమ చేసుకొని ఉంచమన్న అతను...తర్వాత మధ్యాహ్నం మరో ఖాతా నంబరు ఇచ్చి జమ చేయమనడంతో కొంతమంది ఎమ్మెల్యేలకు సందేహం వచ్చింది. ఆర్థిక శాఖలోని ఓ ఉన్నతాధికారిని సంప్రదించారు. అవన్నీ ఫేక్ కాల్స్...మోసపోవద్దని ఘాటుగానే హెచ్చరించడంతో అప్రమత్తమయ్యారు. విషయం ఆర్థిక మంత్రి దృష్టికి వెళ్లింది. ఆయన ఆ ఖాతా గురించి ఆరా తీశారు.
ఆ ఖాతా విశాఖలోని ఓ బ్యాంక్కి చెందినదని, సదరు ఖాత ఓ మహిళ పేరున ఉన్నట్లు తెలిసింది. ఆ ఖాతాలో మంగళవారం సాయంత్రమే రూ. 2.50 లక్షలు జమ అయ్యిందని బ్యాంకు మేనేజరు మంత్రికి చెప్పారు. ఆ సొమ్ము జమ చేసిన వ్యక్తి కాకినాడకు చెందిన ఎమ్మెల్యే అని తెలుసుకున్న మంత్రి... ఆఖాతాను వెంటనే స్తంభింపజేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. జరిగిన మోసం గురించి మంత్రి వెంటనే సదరు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది.
ఆఖరి నిమిషంలో ఆగిపోయాం...
అపరిచిత వ్యక్తి నుంచి మాకు ఫోన్ వచ్చింది. అతను చెప్పినట్లే ఖాతాలో సొమ్ము జమ చేయడానికి సిద్ధమయ్యాం. ఆఖరి నిమిషంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని సంప్రదించాం. అది ఫేక్ కాల్ అని ఆయన చెప్పడంతో ఆఖరి నిమిషంలో సొమ్ము జమ చేయకుండా ఆగిపోయాం.
- పిల్లి సత్యనారాయణమూర్తి
(కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త)
ఎమ్మెల్యేలకు 'వైట్ కాలర్ వల'
Published Thu, Nov 12 2015 8:55 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- IPL 2024: ప్లే ఆఫ్స్ ఛాన్స్లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
Advertisement