వీఆర్‌ఏ అనుమానాస్పద మృతి | suspicious death a VRA in warangal | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏ అనుమానాస్పద మృతి

May 24 2016 11:09 AM | Updated on Sep 4 2017 12:50 AM

వరంగల్ జిల్లా కేసముద్రంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.

వరంగల్ జిల్లా కేసముద్రంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనకు పోలీసులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. బెజ్జం రంజిత్(28) వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు. అతడు సోమవారం స్నేహితులతో కలిసి గుంజేడులో జరిగే జాతరకు వెళ్లాడు. సాయంత్రం అంతా కలసి తిరుగు పయనమయ్యారు. ఆ క్రమంలో వారిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగించారు.

అయితే, మద్యం మత్తులో ఉన్న రంజిత్ పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని నర్సంపేట ఆస్పత్రికి తీసుకె ళ్లి ఆల్కహాల్ పరీక్ష చేయించబోగా అతడు వాదులాటకు దిగాడు. ఈ క్రమంలోనే ముక్కు నుంచి రక్తస్రావం కావటంతో తీవ్ర అస్వస్థతకు గురై అర్థరాత్రి చనిపోయాడు.ఈ సమాచారం అందుకున్న బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులే అతడిని కొట్టి చంపారని ఆరోపిస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయ్నతించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement