సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో తిరుమల చేరుకున్న ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.