డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | student suscide | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Sep 3 2016 9:26 PM | Updated on Nov 9 2018 5:02 PM

ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని మాదాసి వాణి(17) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ముత్తారం:  ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని మాదాసి వాణి(17) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వాణి గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో మట్లాడుతుందని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. దీంతో మనస్తాపం చెందిన వాణి గతనెల 26న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

తల్లిదండ్రుల బంధువుల ఇళ్లలో గాలించి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల మండలం నస్‌పూర్‌లోని బంధువుల ఇంట్లో ఉన్న వాణిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లోని ఉరేసుకుంది. తల్లి మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement