ట్రాక్టర్‌ కింద పడి విద్యార్థి మృతి | Student fell under the tractor | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కింద పడి విద్యార్థి మృతి

Jan 17 2017 12:26 AM | Updated on Nov 9 2018 5:02 PM

కంబదూరు (కళ్యాణదుర్గం): కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన çపురుషోత్తం (18) అనే ఇంటర్‌ విద్యార్థి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కంబదూరు (కళ్యాణదుర్గం): కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన çపురుషోత్తం (18) అనే ఇంటర్‌ విద్యార్థి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటంపల్లికి చెందిన సుబ్బరాయుడు, నాగమణి దంపతుల ఏకైక కుమారుడైన పురుషోత్తం కళ్యాణదుర్గంలోని వివేకనంద జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు.

సోమవారం సాయంత్రం తమ పొలానికి వెళ్లాడు. పక్కనున్న గొల్ల ఈర ఓబుâýæ అనే రైతుకు చెందిన పొలంలో సాగు చేసిన మామిడి చెట్లకు ట్యాంకర్‌ ద్వారా నీళ్లు పెడుతుంటే పురుషోత్తం కూడా అక్కడికి వెళ్లి రన్నింగ్‌లో ఉన్న ట్రాక్టర్‌ను ఎక్కబోతూ అదుపుతప్పి కిందపడ్డాడు. అతడిపై ట్రాక్టర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ నరసింహుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement