తమిళ కూలీల స్థావరాలు గుర్తింపు
చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల సరిహద్దులపై ప్రత్యేక నిఘా
ఫారెస్టు, పోలీసు, టాస్క్ఫోర్స్ దాడులు ముమ్మరం
భాకరాపేట: తిరుపతి టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో శేషాచలం అడవుల్లో చేపట్టిన కూంబింగ్ కొనసాగుతోంది. తమిళ కూలీలు రాత్రిపూట ఉండే ప్రధాన స్థావరాలను టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలో పరిధిలో ఉన్న ఎర్రచందనం వనాలలోని 28 స్థావరాలను గుర్తించారు. రాత్రిపూట ఉండేందుకు ఈ స్థావరాలు అనువుగా ఉన్నాయని, సమీపంలో తాగునీటి వసతి ఉండడంతో కూలీలు వాటినే కుటీరాలుగా మలుచుకున్నారని టాస్క్ఫోర్స్ అధికారులు చెబుతు న్నారు. ఈ స్థావరాలపై దృష్టి పెట్టడంతోనే నాలుగు రోజుల క్రితం వందలాది మంది కూలీలను టాస్క్ఫోర్స్, ఫారెస్టు అధికారులు వైఎస్సార్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పట్టుకోగలిగారు.
సరిహద్దులపై ప్రత్యేక నిఘా..
శేషాచలం అటవీ ప్రాంతంలోని చిత్తూరు, వైఎస్సార్ జిల్లా సరిహద్దులపై టాస్క్ఫోర్స్ నిఘా పెట్టింది. సరిహద్దులు దాటిపోతున్న అక్రమ వాహనాలు, అందుకు సహకరిస్తున్న వారిని కూడా గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా వైఎస్సార్ జిల్లా భాకరాపేట, చిత్తూరు జిల్లా భాకరాపేట కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మధ్య కాలంలో భాకరాపేట నుంచి టాస్క్ఫోర్స్, పోలీసు, ఫారెస్టు అధికారులకు సమాచారం వస్తోంది. అధికారులు అక్కడికి చేరుకునే లోపు దొంగలు తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో భాకరాపేటలో ప్రొటెక్షన్ వాచర్లు మరిన్ని ఏర్పాటు చేస్తున్నారు.
దాడులు ముమ్మరం..
టాస్క్ఫోర్స్, పోలీసులు, అటవీ శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. జిల్లా పోలీసు అధికారులు సైతం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న పీలేరు రూరల్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. భాకరాపేట కేంద్రంగా నాలుగు రోడ్ల కూడలిలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసి వాహనాలను గమనిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా భాకరాపేటలో నిఘా పెంచారు.
శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్
Published Wed, Mar 15 2017 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement