జమ్మికుంట : తమ సమస్యలు పరిష్కరించాలని రెండో ఏఎన్ఎంలు చేస్తున్న సమ్మె ఏడోరోజుకు చేరింది. ఆందోళనల్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలోని సమ్మె శిబిరం నుంచి ఆదివారం ఏఎన్ఎంలు ర్యాలీ చేపట్టారు. గాంధీ చౌక్ వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుతం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఏడో రోజుకు చేరిన రెండో ఏఎన్ఎంల సమ్మె
Jul 24 2016 9:20 PM | Updated on Sep 4 2017 6:04 AM
జమ్మికుంట : తమ సమస్యలు పరిష్కరించాలని రెండో ఏఎన్ఎంలు చేస్తున్న సమ్మె ఏడోరోజుకు చేరింది. ఆందోళనల్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలోని సమ్మె శిబిరం నుంచి ఆదివారం ఏఎన్ఎంలు ర్యాలీ చేపట్టారు. గాంధీ చౌక్ వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుతం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వావిలాల, ఇల్లందకుంట, చల్లూర్, వీణవంక మండలాల పీహెచ్సీల పరిధిలోని సెకండ్ ఏఎన్ఎంలు సునీత, రమ, విజయ, వనిత, జ్యోతి, మణేమ్మ, ప్రమీల, హైమావతి, అంజలీ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement