
కోర్టుకు హాజరైన హెడ్కానిస్టేబుల్ ప్రసాద్
ఆకతాయిల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పోకిరి అవతారమెత్తి చివరకు జైలు పాలయ్యాడు.
బస్సులో ఉన్నంత సేపు పెళ్లి బృందంలోని ఓ యువతితో వెకిలిగా ప్రవర్తించాడు. బస్సు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ చేరాక, ఈ యువతి లగేజి తీసుకుంటూ ఉండగా హెడ్కానిస్టేబుల్ ప్రసాద్ సెల్ఫోన్లో ఫొటోలు తీశాడు. ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని చితకబాది వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. సీఐ ప్రవీణ్కుమార్ కేసు నమోదు చేసి అతన్ని శుక్రవారం జేఎఫ్సీఎం కోర్టులో హాజరు పరిచారు. జడ్జి బాబాఫకృద్దీన్ బెయిల్కు నిరాకరించి రిమాండ్కు తరలించాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని సబ్జైలుకు తరలించారు.