'జన్మభూమి కమిటీల పేరుతో దోపిడి' | Raghuveera reddy takes on govt of ap and central govt | Sakshi
Sakshi News home page

'జన్మభూమి కమిటీల పేరుతో దోపిడి'

Jan 29 2016 12:26 PM | Updated on Aug 18 2018 9:13 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం అనంతపురంలో మండిపడ్డారు.

అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ  చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం అనంతపురంలో మండిపడ్డారు. రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చడం దుర్మార్గం అని అటు కేంద్ర ప్రభుత్వం... ఇటు రాష్ట్రప్రభుత్వాంపై రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. ఫిబ్రవరి 2వ తేదీన బండ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటిస్తారని గుర్తు చేశారు. కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్పంచులతో రాహుల్ సమావేశం అవుతారని రఘువీరా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement