కార్యాలయాలను పరిశీలించిన రాచకొండ కమిషనర్‌ | Sakshi
Sakshi News home page

కార్యాలయాలను పరిశీలించిన రాచకొండ కమిషనర్‌

Published Thu, Oct 6 2016 9:39 PM

rachakonda commissinor visited to the offices

భువనగిరి అర్బన్‌ : యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయనున్న పలు జిల్లా కార్యాలయాలను గురువారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ పరిశీలించారు. ఇందులో భాగంగా భువనగిరి మండలంలోని పగిడిపల్లి గ్రామంలో ఉన్న యాదాద్రి జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనాన్ని చూశారు. అనంతరం అక్కడి నుంచి హన్మాపురం గ్రామ శివారులో ఉన్న జిల్లా పోలీస్‌ కార్యాలయం, భువనగిరిలో ఏర్పాటు అవుతున్న ఎస్పీ క్యాంపు, రాయగిరి గ్రామంలో ఉన్న పోలీస్‌ ఔట్‌ పోస్టు కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండగ రోజున కార్యాలయాలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. భువనగిరి, చౌటుప్పల్‌లో ఏసీపీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలపై ఎస్పీ, డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, డీఎస్పీ ఎస్‌.మోహన్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్‌  ఎం. శంకర్‌గౌడ్, రూరల్‌ సీఐ అర్జునయ్య, యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.    
 

Advertisement

తప్పక చదవండి

Advertisement