శాలిగౌరారం
తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లిన అత్తమామలు తిరిగి కాపురానికి పంపాలని ఓ వ్యక్తి సోమవారం రాత్రి మండలకేంద్రంలోని ఓ సెల్టవర్ ఆందోళన చేశాడు. సుమారు రెండు గంటలపాటు తీవ్ర ఉత్కంఠను కలిగించిన ఆ వ్యక్తిని పోలీసులు కిందకు దించి పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మనిమద్దె గ్రామానికి చెందిన పోలేపాక సుధాకర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపనీలో గత సంవత్సరం సూపర్వైజర్గా పనిచేశాడు. ఆ సమయంలో అదే కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న నేరేడుచర్ల మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన బైరి వసంతలు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు 5 మార్చి 2016న ఉప్పల్లోని సాయిబాబా దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మీర్పేట సీఐ రాములును కలిశారు. దీంతో ఆయన ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి విచారించగా వసంత తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయారు. సుధాకర్, వసంతలు మేజర్ కావడంతో మీ ఇష్టప్రకారం నడుచుకోవాలని సీఐ చెప్పారు. దీంతో సుధాకర్ తన సొంత గ్రామమైన మనిమద్దెకు వచ్చి కుటింబీకులతో కలిసి కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వసంత కుటింబీకులు, బంధువులు సుధాకర్ను పలుమార్లు ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా వసంత తల్లిదండ్రులు ఈనెల 23న వసంతను బలవంతంగా లాక్కెళ్లారు. ఆ సమయంలో అడ్డువచ్చిన సుధాకర్ తల్లిని చంపుతామని బెదిరించారు. వెంటనే సుధాకర్ పోలీస్స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈనెల 24న సజ్జాపురం వెళ్లగా అక్కడ వసంత ఆచూకీ లభించలేదు. దీంతో వారి బంధువుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భార్యను కాపురానికి పంపకుండా తన అత్తమామలు వ్యవహరిస్తున్నారంటూ మనస్తాపానికి గురైన సుధాకర్ సోమవారం పోలీస్స్టేషన్కు వచ్చివెళ్తూ సాయంత్రం మండలకేంద్రంలోని సెల్టవర్ను ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న సుధాకర్ తల్లిదండ్రులు, స్నేహితులతో పాటు ఎస్ఐ అయోధ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సుధాకర్కు నచ్చజెప్పి కిందకు దించేందుకు నానాహైరాన పడ్డారు. న్యాయం జరిగేలా చూస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు రాత్రి 7.30 గంటలకు సుధాకర్ సెల్టవర్ దిగికిందకు వచ్చాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు.
భార్యను పుట్టింటికి తీసుకెళ్లారని..
Published Tue, Aug 30 2016 12:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంతంగా సీఎం టూర్
కలప స్వాధీనం
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
క్రీడా సెక్రటరీ పోస్టుకు జోరుగా పైరవీలు !
వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం
సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి
వన్యప్రాణుల వేటకు యత్నించిన ముగ్గురి అరెస్ట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
మొదటి నెల పర్వాలేదు..
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement