రామయ్యా.. నీ దర్శన భాగ్యమేది.. | Pushkara devotees does not have chance to visit temple | Sakshi
Sakshi News home page

రామయ్యా.. నీ దర్శన భాగ్యమేది..

Jul 22 2015 10:51 AM | Updated on Aug 1 2018 5:04 PM

రామయ్యా.. నీ దర్శన భాగ్యమేది.. - Sakshi

రామయ్యా.. నీ దర్శన భాగ్యమేది..

గోదావరి పుష్కరాలకు ఖమ్మం జిల్లా భద్రాచలానికి భక్త జనం పోటెత్తుతున్నారు.

భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరాలకు ఖమ్మం జిల్లా భద్రాచలానికి భక్త జనం పోటెత్తుతున్నారు. పుష్కర స్నానం అనంతరం శ్రీసీతారాముల వారి దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కానీ ఆలయ అధికారులు, పోలీసులు పెడుతున్న ఆంక్షలతో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగడం లేదు.  ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్‌లో టెక్కెట్లు తీసుకున్న భక్తులకు నిరాశే ఎదురవుతోంది. పుష్కరాల్లో మొదటి మూడు రోజలు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినప్పటికీ శనివారం నుంచి సీన్ రివర్స్ అయ్యింది.  పుష్కర స్నానం అనంతరం స్వామివారిని దర్శించుకోకుండానే భక్తులు వెనుదిరుగుతున్నారు.

కాగా శనివారం నుంచి టిక్కెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కల్యాణోత్సవం మినహా,  భక్తుల పేరిట ఆర్జిత సేవలన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా దేవస్థానానికి ఆదాయం బాగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని దేవస్థానం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటకీ, గోదావరి పుష్కరాలు పూర్తయ్యేంత వరకూ టిక్కెట్ల విక్రయాలు చేపట్టడానికి వీల్లేదని తెగేసి చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement