
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఖాజీపేట మండలం భూమాయపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. భాగ్యనగరం గ్రామానికి చెందిన పెద్దపోలయ్య, వీరయ్యలు వడ్లు కొనుగోలు చేసేందుకు ద్విచక్రవాహనంపై బయలు దేరారు.
ఖాజీపేట: ఖాజీపేట మండలం భూమాయపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. భాగ్యనగరం గ్రామానికి చెందిన పెద్దపోలయ్య, వీరయ్యలు వడ్లు కొనుగోలు చేసేందుకు ద్విచక్రవాహనంపై బయలు దేరారు. జాతీయ రహదారి నుంచి భూమాయపల్లెకు వస్తున్న వరికోత యంత్రం వారి ద్విచక్ర వాహనాన్ని కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనుక ఉన్న వీరయ్య మృతి చెందగా వాహనం నడుపుతున్న పోలయ్య స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.