చక్రాయపేట/పులివెందుల : మండలంలోని అద్దాలమర్రి క్రాస్ వద్ద కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కండ్లి పెద్ద గంగన్న (40) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేంపల్లె శ్రీరామ్ నగర్కు చెందిన కండ్లి పెద్ద గంగన్న కుటుంబం అద్దాలమర్రి క్రాస్ వద్ద పందులను మేపుకుంటూ జీవనం సాగించేవారు. వీరు ఆదివారం పందులను మేపుకొని రోడ్డు దాటిస్తుండగా.. వేముల మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నాగేళ్ల సత్యప్రభావతమ్మ కుమారుడు పవన్ విశ్వేశ్వరరెడ్డి, కోడలు కవిత గుర్రం కొండలో ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా.. అద్దాల మర్రి క్రాస్ వద్ద పందులు రోడ్డుకు అడ్డంగా వచ్చాయి. వాటిని తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న పందుల యజమాని పెద్ద గంగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా విశ్వేశ్వరరెడ్డి కుడి భుజానికి బలంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఇడుపులపాయ పోలీసులు కేసు నమోదు చేశారు.
పవన్ విశ్వేశ్వరరెడ్డిని పరామర్శించిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి :
అద్దాలమర్రి క్రాస్ వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో గాయపడిన పవన్ విశ్వేశ్వరరెడ్డి మెరుగైన చికిత్స కోసం పులివెందుల దినేష్ మెడికల్ సెంటర్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ఆర్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి వైఎస్ భాస్కర్రెడ్డిలు దినేష్ మెడికల్ సెంటర్కు చేరుకొని పవన్ విశ్వేశ్వరరెడ్డిని పరామర్శించి తండ్రి నాగేళ్ల సాంబశివారెడ్డికి ధైర్యం చెప్పారు. వేముల జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరామర్శించారు.
కారు బోల్తా .. ఒకరి దుర్మరణం
Published Sun, Sep 18 2016 11:11 PM
Advertisement
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement