కాపులకు రుణాలపై కొత్త మెలిక | new twist in kapu lones | Sakshi
Sakshi News home page

కాపులకు రుణాలపై కొత్త మెలిక

Jul 16 2016 6:39 PM | Updated on Sep 4 2017 5:01 AM

కాపు కులస్తులకు రుణాల మంజూరు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తన మోసకారి తనాన్ని బయటపెట్టుకుంది. ముద్రగడ దీక్ష సమయంలో చేసిన వాగ్ధానాన్ని తుంగలో తొక్కుతూ..

విజయవాడ: కాపు కులస్తులకు రుణాల మంజూరు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తన మోసకారి తనాన్ని బయటపెట్టుకుంది. ముద్రగడ దీక్ష సమయంలో చేసిన వాగ్ధానాన్ని తుంగలో తొక్కుతూ .. దరఖాస్తులు చేసుకున్న అందరికీ రుణాలు ఇవ్వబోమని వెల్లడించింది. (చదవండి: కాపులకు మరో షాక్!)

కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుంజయ శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఏడాదికి 40 వేల మందికి మాత్రమే రుణాలు ఇస్తామని,  అదికూడా యూనిట్లు ఏర్పాటుచేసుకున్నవారికే ఇస్తామని తెలిపారు. కొంతమంది రుణాలను దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే యూనిట్ లేకుండా రుణం ఇవ్వబోమని రామానుంజయ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement