ఆందోళన బాటన ‘ఆదర్శ’ టీచర్లు | model teachers on protest way | Sakshi
Sakshi News home page

ఆందోళన బాటన ‘ఆదర్శ’ టీచర్లు

Nov 25 2016 10:53 PM | Updated on Sep 4 2017 9:06 PM

ఆందోళన బాటన ‘ఆదర్శ’ టీచర్లు

ఆందోళన బాటన ‘ఆదర్శ’ టీచర్లు

సమస్యల పరిష్కారం కోసం.. ఈ నెల28 నుంచి ఆందోళన బాట పట్టనున్నట్లు ఏపీ మోడల్‌ స్కూల్స్‌ జేఏసీ నాయకులు తెలిపారు.

 – ఈ నెల 28, 29న పెన్‌ డౌన్‌
– 30 న కలెక్టరేట్‌ ముట్టడి
కర్నూలు సిటీ: సమస్యల పరిష్కారం కోసం.. ఈ నెల28 నుంచి ఆందోళన బాట పట్టనున్నట్లు ఏపీ మోడల్‌ స్కూల్స్‌ జేఏసీ నాయకులు తెలిపారు. శుక్రవారం డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్‌ పీఎన్‌ జాస్మిన్‌ మాట్లాడుతూ.. పీఆర్‌సీ సాధన, సర్వీస్‌ రూల్స్, హాస్టళ్ల అదనపు బాధ్యతలకు నిరసనగా ఆందోళనలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 28, 29తేదీలలో పెన్‌డౌన్, 30వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి, వచ్చే నెల7వ తేదీన సచివాలయాన్ని ముట్టడించనున్నామన్నారు. డీఈఓకు వినతి పత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు ఆశాజ్యోతి, నాగయల్లప్ప, టీవీ మార్కండేయులు, వెంకటేశ్వర్లుల తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement