వెంకటాద్రి ఇళ్ల వద్ద ఎండిపోయిన వేరుశనగ పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం రెయిన్గన్ల పేరిట ప్రభుత్వం రూ.170 కోట్ల ప్రజాదనం దుర్వినియోగం చేసిందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. సోమవారం పీలేరు మండల వెంకటాద్రి ఇళ్ల వద్ద ఎండిపోయిన వేరుశనగ పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు.
– ప్రత్యేకాధికారుల అడ్రస్ ఎక్కడ?
– రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
– ఇన్పుట్ సబ్సిడీ రైతుల అకౌంట్లో జమచేయాలి
ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
పీలేరు:
రాష్ట్ర ప్రభుత్వం రెయిన్గన్ల పేరిట ప్రభుత్వం రూ.170 కోట్ల ప్రజాదనం దుర్వినియోగం చేసిందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. సోమవారం పీలేరు మండల వెంకటాద్రి ఇళ్ల వద్ద ఎండిపోయిన వేరుశనగ పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పూర్తిగా పంటలు ఎండిపోయన్నారు. మూడు రోజులు సీఎం, మంత్రులు పర్యటించి రెయిన్గన్స్, స్ప్రింకర్లు, ఆయిల్ ఇంజన్లు, ట్యాంకర్లంటూ హడావిడి చేయడంతప్ప ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాపాడిన దాఖలాలు లేవన్నారు. సీఎం తన పబ్లిసిటీ కోసం ఆర్భాటం చేశారు తప్ప రైతులకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. పంటలను కాపాడేందుకు నియమించిన ప్రత్యేకాధికారులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేతనైతే రైతుల ఖాతాలలో ఇన్పుట్ సబ్బిడీ, పంటల భీమా వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెయిన్గన్లతో ఎన్ని ఎకరాల్లో వేరుశనగ పంట కాపాడారో దానిపై నిజనిర్ధారణ కమిటీ వేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయి రైతులు లబోదిబోమంటున్నా ఈ ప్రభత్వానికి కనపడడం లేదని విమర్శించారు. 23న చిత్తూరులో జరుగనున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమావేశంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలదీస్తామన్నారు.