-
‘తమ్ముళ్ల’ ఇళ్లలో సిరుల వర్షం
పంట సంజీవని ‘పచ్చ’ తమ్ముళ్లకు వరాలిచ్చింది. కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు నేతల ఇళ్లలో సిరుల వర్షం కురిపించాయి. రైతుల ప్రయోజనాలను గాలికొదిలి ఏకంగా సొంత ఆస్తిలా అమ్ముకున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అప్పట్లో టీడీపీ అధికార పార్టీ కావడంతో అధికారులు కూడా నోరు తెరవలేని పరిస్థితి. ఇప్పుడు డొంక కదులుతోంది. ఖరీఫ్ సీజన్ కావడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రెయిన్గన్లు ఎక్కడని వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తే.. మౌనమే సమాధానమవుతోంది. సాక్షి, అనంతపురం : వరుణదేవుడు కరుణించకపోయినా పంటలను కాపాడుతామని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెయిన్గన్లను తెరపైకి తీసుకొచ్చారు. 2016లో వీటిని ప్రారంభించారు. ఆ ఏడాది దాదాపు 15.15లక్షల ఎకరాల్లో పంటసాగైతే మొత్తం పంట ఎండిపోయింది. ఆ సందర్భంగా బాబు నాలుగురోజులు జిల్లాలోనే తిష్టవేసి పంటను కాపాడినట్లు మసిపూసి మారేడుకాయ చేశారు. ఏకంగా సీఎం తరలిరావడంతో బెంబేలెత్తిన అధికారులు రెయిన్గన్లను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. అయినప్పటికీ ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారు. దీంతో వీటివల్ల ఉపయోగం లేదని తేల్చారు. ఇది ఓ విఫలప్రయత్నం అని, రెయిన్గన్లతో చెడ్డపేరు తప్ప మరొకటి లేదని గ్రహించిన ప్రభుత్వం వాటి ఊసెత్తడమే మరిచింది. ఇక అధికారులు కూడా ఆ తంతు ముగిసనట్లేనని భావించి పరికరాల రికవరీని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మంత్రి శంకరనారాయణ ఇటీవల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి రెయిన్గన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. పరికరాలు ఎక్కడని జేడీని ప్రశ్నించారు. అందుకాయన రైతుల వద్దే ఉన్నాయని చెప్పలేక చెప్పారు. అవి ప్రభుత్వానివా? ప్రయివేటువా? కార్యాలయాల్లో ఎందుకు లేవు? అని తిరిగి ఎమ్మెల్యే ప్రశ్నించడంతో జేడీఏ నుంచి సమాధానం కరువైంది. ఈ నేపథ్యంలో రెయిన్గన్లు ఎక్కడనే విషయమై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే 30 శాతం కూడా అధికారుల వద్ద లేవని తేలింది. 70 శాతం పైగా పరికరాలను రైతుల పేరుతో టీడీపీ నేతలు విక్రయించి సొమ్ము చేసుకోవడం గమనార్హం. అధికారుల ఉరుకులు పరుగులు అధికారపార్టీ ఎమ్మెల్యేలు వీటి ప్రస్తావన తేవడంతో వ్యవసాయాధికారులు రికవరీపై దృష్టి సారించారు. నాలుగురోజుల్లో రెయిన్గన్లపై పూర్తి వివరాలు కావాలని ఏఓలు, ఏడీలను జేడీ హబీబ్బాషా ఆదేశించారు. అయితే అధికారులంతా బదిలీల్లో తలమునకలై ఉన్నారు. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకునే పరిస్థితి కరువైంది. రికవరీ కాకపోతే కొత్త ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు. దీంతో బాధ్యులైన టీడీపీ నేతలను తేల్చి, అవసరమైతే వారిపై కేసులు నమోదు చేసి రికవరీ చేసే యోచనలో వ్యవసాయాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ రెయిన్గన్ల పరిస్థితి జిల్లా వ్యాప్తంగా 6,426 రెయిన్గన్లు, 5,894 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4478 ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటిని రూ.69.79కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే వీటిలో ఏడాదికే 20శాతం రెయిన్గన్లు ఆచూకీ లేకుండా పోయాయి. 2019 ఖరీఫ్ వచ్చే సమయానికి వీటిలో 30శాతం కూడా లేని పరిస్థితి. రెయిన్గన్లు రైతులు తీసుకున్న తర్వాత పనిముగించుకుని మరో రైతుకు ఇచ్చారు. ఆ రైతు ఇంకో రైతుకు ఇచ్చారు. ఇలా రెయిన్గన్లు చేతులు మారాయి. ఈ ప్రక్రియ ఆయా గ్రామాల్లోని స్థానిక అధికారపార్టీ నేతల కనుసన్నల్లో సాగింది. వారివద్దకు వెళ్లిన వారికే రెయిన్గన్లు ఇచ్చారు. ఆ తర్వాత రైతులు తిరిగి అధికారపార్టీ నేతలకు అప్పగించారు. టీడీపీ నేతల వద్ద రెయిన్గన్లు ఉన్నట్లు వ్యవసాయాధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో వీటిని అధికారపార్టీ నేతలు కర్ణాటక రైతులకు విక్రయించారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో ప్రచురితమైంది. అప్పటికి మేల్కొన్న అధికారులు రికవరీపై దృష్టి సారించారు. ఏఓలు, ఎంపీఈఓలను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపగా.. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయనే విషయం వెల్లడైంది. కొందరు నేతలు పరికరాలు ఇచ్చేయగా.. ఇంకొందరు అతిబలవంతంగా పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసిన పైపులు కాకుండా వేరే పైపులు, పనిచేయకుండా తుక్కుగా మారిన ఆయిల్ ఇంజన్లను చేతుల్లో పెట్టి పంపారు. ఆ మేరకు అతికష్టం మీద కొన్ని రికవరీ అయ్యాయి. తర్వాత ఏడాది కూడా ప్రణాళిక లేకుండా పంపిణీ జరిగింది. అంతే ఇక రెయిన్గన్లు జాడ లేకుండాపోయాయి. రాప్తాడు, తాడిపత్రి, కదిరి, కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర, రాయదుర్గం నియోజకవర్గాల్లో అధికంగా రికవరీ కావల్సి ఉంది. -
రెయిన్గన్లు ఎక్కడ?
వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు రూ. కోట్లు వెచ్చించి రెయిన్గన్లు కొనుగోలు చేశారు. వ్యవసాయ యంత్రాంగం ఆధీనంలో ఉండాల్సిన ఈ విలువైన పరికరాలు ఇప్పుడు ఎక్కడున్నాయో అంతుచిక్కడం లేదు. కొన్ని టీడీపీ నేతల ఇళ్లలో ఉండగా, మరికొన్నింటిని ఇది వరకే వారు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. అప్పట్లో వ్యవసాయాధికారులు పట్టించుకోకపోవడంతో రెయిన్గన్ల గల్లంతు వ్యవహారం వారి మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే రెయిన్గన్లు ఎక్కడ ఉన్నాయో తేల్చాలని వ్యవసాయశాఖ ఆదేశించడంతో వారికి దిక్కుతోచడం లేదు. కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు రూ.40 కోట్లు ఎస్డీపీ నిధులతో 2015లో జిల్లాకు 4,530 రెయిన్గన్లు కొనుగోలు చేశారు. ఇందులో 2016లో 1000 రెయిన్ గన్లను చిత్తూరు జిల్లాకు తరలించారు. ప్రస్తుతం జిల్లాలో 3,530 రెయిన్గన్లు ఉండాలి. 2017లో రెయిన్గన్లు, పైపులు, స్ప్రింక్లర్లు తదితర వాటిని జియో ట్యాగింగ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, జియో ట్యాగింగ్కు ఇందులో చాలా వరకు లభ్యం కాలేదు. కనీసం 50శాతం కూడా కనిపించలేదు. అధికార పార్టీ నేతల అధీనంలో అవి ఉన్నట్లు అధికారులకు స్పష్టంగా తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రెయిన్గన్లు మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వ చేశారు. వినియోగం లేక అవి తుప్పుపట్టిపోతున్నాయి. జిల్లాలో 1,317 ఆయిల్ ఇంజిన్లు, 5,175 స్ప్రింక్లర్లు, 2.50 లక్షల పైపులు ఉండాలి. వీటిలో 50 శాతం వరకు జాడా లేకుండా పోయాయి. మొత్తంగా రూ.20 కోట్ల విలువ చేసే రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజిన్లు, పైపులు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ తెలుగుదేశం నేతల ఇళ్లలో ఉన్నట్లు సమాచారం. హడావుడిగా కొనుగోలు వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోకుండా రక్షక నీటి తడులు ఇచ్చి కాపాడేందుకు 2015లో అప్పటి జిల్లా యంత్రాంగం హడావుడిగా రెయిన్గన్లు కొనుగోలు చేసింది. వీటి కొనుగోలులో అప్పటి జిల్లా యంత్రాంగానికి కమీషన్ల రూపంలో భారీగానే ముట్టినట్లు ఆరోపణలున్నాయి. తర్వాత చేసిన హడావుడిలో ఆ రెయిన్గన్లను జిల్లా యంత్రాంగం తెలుగుదేశం పార్టీ నేతల పరం చేసింది. వారిలో కొందరు వాటిని పత్తికొండ, ఆలూరు, ఆదోని సబ్ డివిజన్లలో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో తెప్పించిన రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజిన్లు దుర్వినియోగమయ్యాయి. గతేడాది రెయిన్గన్ల ఊసెత్తని అధికారులు గతంలో ఎప్పుడూ లేని విధంగా 2018–19లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల తీవ్ర వర్షాభావ పరిస్థితులే. భూమి తడారిపోవడంతో ఖరీఫ్, రబీ పంటలన్నీ పూర్తిగా మాడిపోయాయి. గతంలో కొనుగోలు చేసి తెచ్చిన రెయిన్గన్లున్నాయి కదా వాటితో పంటలను కాపాడుదాం అనే అలోచనే వ్యవసాయశాఖకు రాలేదు. సార్.. రెయిన్గన్లు ఇస్తే కొంతవరకు పంట తడుపుకుంటామని రైతులు అడిగినా పట్టించుకోలేదు. దీంతో వారు పంటలకు పెట్టిన పెట్టుబడులు చేతికిరాక తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికైనా రెయిన్గన్లు ఎక్కడ ఉన్నాయనే విషయం తేలుస్తారో? లేక టీడీపీ నేతల ఇళ్లలోనే వాటిని వదిలేస్తారో? చూడాల్సి ఉంది. -
రెయిన్ గన్..ఓ విఫల ప్రయోగం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసిన రెయిన్ గన్స్ ఇపుడు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రాన్ని కరువు కుదిపేస్తున్న తరుణంలో రెయిన్గన్స్ౖ గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసిన రెయిన్ గన్లు ప్రస్తుతం ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో, వాటిని ఎవరైనా వాడుతున్నారో లేదో ఎవరికీ తెలియడం లేదు. రూ.వందల కోట్ల ప్రజాధనం కుమ్మరించి, కొనుగోలు చేసిన రెయిన్గన్స్ ఆచూకీ లేకుండాపోయాయి. రెండేళ్ల క్రితం రెయిన్ గన్ల గురించి భారీగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత వాటి ఊసెత్తడం మానేసింది. వర్షాధార పంటలకు మాత్రమే ఉపయోగపడే రెయిన్ గన్లతో అన్ని పంటలనూ కాపాడుకోవచ్చని ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే, అవి రైతులకు ఉపయోగపడిన దాఖలా లు లేవు. గతంలో ఒక్కొక్క మండలానికి 3 నుంచి 10 వరకు రెయిన్ గన్స్ను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ శాఖ అధికారులు 15 కంపెనీల నుంచి వీటిని కొనుగోలు చేశారు. వాస్తవానికి నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో వర్షాధార పంటలకు ఒకటి లేదా రెండు తడులు ఇవ్వడానికి మాత్రమే రెయిన్ గన్లను డిజైన్ చేశారు. పొలాలకు సమీపంలోని నీటి గుంతలు, చెరువులు, కాలువలు, ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి, రెయిన్ గన్ల సాయంతో సగటున ఎకరం పొలం తడిసేలా ఏర్పాటు చేయవచ్చు. అయితే వర్షాధార పంటలకు మాత్రమే ఇవి పనికొస్తాయి. ఒక్కో యూనిట్ ధర రూ.50 వేల పైమాటే కరువు బారినపడ్డ పంటలను రక్షిస్తామంటూ.. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి రూ.163 కోట్లు ఖర్చు పెట్టి 13,334 రెయిన్ గన్లు, స్ప్రింకర్లు, 7,970 ఆయిల్ ఇంజిన్లు, 3.50 లక్షల నీటి పైపులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం మరో రూ.103 కోట్లు ఖర్చు పెట్టింది. రెయిన్గన్ల కొనుగోలు వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు అప్పట్లో శాసనసభలో దుమారం చెలరేగింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన 13,334 రెయిన్గన్లు ప్రస్తుతం ఎక్కడున్నాయో తెలియదు. అవి ఇప్పుడు ఎక్కడా పంటల పొలాల్లో పెద్దగా కనిపించడం లేదు. వాస్తవానికి రెండేళ్లుగా ప్రభుత్వంతో సహా రైతులు కూడా రెయిన్ గన్లను పూర్తిగా మరిచిపోయారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో వ్యవసాయశాఖ గోదాములకే రెయిన్ గన్ కిట్లు పరిమితమయ్యాయి. రాష్ట్రంలో 11 జిల్లాల్లో ఇవి ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో వీటిని అసలు వినియోగించలేదు. రెయిన్ గన్ కిట్లో రూ.6 వేల ఖరీదు చేసే రెయిన్ గన్, రూ.24 వేల ఖరీదైన ఆయిల్ ఇంజిన్, రూ.14 వేల విలువైన 20 పైపులు, రూ.7 వేల విలువ చేసే స్ప్రింక్లర్ల సెట్ ఉంటాయి. ఒక యూనిట్ ఖరీదు రూ.50 వేలకు పైగానే ఉంటుంది. టీడీపీ నేతల ఇళ్లల్లో రెయిన్గన్లు ఉద్యాన వన, సూక్ష్మ నీటిపారుదల పథకం కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన 13,334 రెయిన్ గన్లు అడ్రస్ లేకుండా పోయాయి. అప్పట్లో రెయిన్ గన్లు కొన్న తర్వాత 2016 ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలోనే మకాం వేసి 4 రోజుల్లో 4 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడామని ప్రకటించారు. చంద్రబాబు రెయిన్ గన్ను ప్రారంభించిన పొలంలోనే పంట ఎండిపోయింది. ఇప్పుడా రెయిన్ గన్లు, వీటికి ఉపకరణాలైన ఆయిల్ ఇంజిన్లు, స్ప్రింక్లర్లు, పైపులు, ఇతరత్రా సామగ్రిలో మూడొంతులు అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు చేరాయి. ఈ రెయిన్ గన్స్లో దాదాపు సగం అంటే 6,426 గన్లను, 4306 ఆయిల్ ఇంజన్లను, 5,894 స్ప్రింకర్లు, 4.11 లక్షల పైపులను అనంతపురం జిల్లాకు ఇచ్చామని అధికారిక లెక్కలు చూపినా వీటిల్లో 60 శాతం ఎక్కడున్నాయో తెలియడం లేదని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు ఏం చేయాలో తెలియక వ్యవసాయ అధికారులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే రెయిన్ గన్లతో 2018లో కూడా వేలాది ఎకరాల్లో పంటలను కాపాడానని సీఎం ఇటీవల శ్వేతపత్రంలో పేర్కొనడం గమనార్హం. రెయిన్గన్ అంటే? బిందు, తుంపర సేద్యానికి ఉపయోగించే పరికరం లాంటిదే రెయిన్గన్. పంటను బట్టి రెయిన్ గన్ స్టాండ్లను ఏర్పాటు చేస్తారు. జొన్న, సజ్జ, చెరకు వంటి వాటికైతే ఐదారు అడుగులు, మిర్చి, పత్తి తదితర పంటలకు రెండు మూడు అడుగుల ఎత్తులో స్టాండ్లను అమర్చుతారు. సామర్థ్యాన్ని బట్టి కొన్ని రెయిన్గన్లు సుమారు 45 మీటర్ల వరకు కూడా నీటిని విరజిమ్ముతాయి. ఇది పని చేయడానికి 5 హెచ్పీ ఇంజిన్ కావాలి. బోర్లు, బావులు, కాలువలు, చెరువులు, కుంటల్లో నీరున్నప్పుడే వీటిని వినియోగించడం సాధ్యమవుతుంది. లేదంటే ఎక్కడి నుంచైనా ట్యాంకర్లతో తెచ్చుకోవాలి. నీటి వనరులున్న ప్రాంతం వద్ద ఆయిల్ ఇంజిన్ను ఏర్పాటు చేసి పైపుల ద్వారా నీటిని రెయిన్గన్కు అందిస్తే అది నీటిని చిమ్ముతుంది. ఎక్కడి నుంచో నీటిని తీసుకొచ్చి చేలను తడుపుతామనడం అశాస్త్రీయమని నిపుణులు చెబుతున్నారు. రెయిన్ గన్ ప్రయోగం కొత్తేమీ కాదు నిజానికి రెయిన్గన్ల ప్రయోగం కొత్తదేమీ కాదు. హైదరాబాద్లోని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం(క్రిడా)లో వీటిని పదేళ్ల క్రితమే ప్రయోగించారు. ఒక్కో గన్ నిమిషానికి 240 లీటర్ల చొప్పున 24 మీటర్ల చుట్టూ వృత్తాకారంలో నీటిని చిమ్ముతుంది. ఒక్కో విడతకు 1,809 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గంటకు 14,400 లీటర్ల నీటిని వెదజల్లుతుంది. అంటే కేవలం 8 మిల్లీమీటర్ల వర్షపాతంతో సమానం. అనంతపురం వంటి జిల్లాల్లోని తేలికపాటి ఎర్రభూముల్లో ఈ నీటి పరిమాణం ఏమాత్రం సరిపోదు. మెట్టప్రాంతాల్లో ఎండిపోయే దశకు వచ్చిన పంటలకు కనీసం 30 మిల్లీమీటర్ల వర్షపాతం కావాలి. భూమిలో 15 సెంటీమీటర్ల లోతు వరకు తడిపినప్పుడు మాత్రమే పంట నిలుస్తుంది. ఇంతటి నీటి తడి ఇవ్వాలంటే రెయిన్గన్లు కనీసం 3 గంటల 45 నిమిషాలు పని చేయాలి. రెండు మూడు సార్లు షిఫ్ట్ పద్ధతిలో వీటిని ఉపయోగించాలి. ఎకరానికి 30 మిల్లీమీటర్ల వర్షపాతానికి సమానమైన నీటి తడి పెట్టాలంటే 1,21,500 లీటర్ల నీరు కావాలి. ఇంత నీరు అంటే ఒక్కొక్కటి 6 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న 20 ట్యాంకులు కావాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రెయిన్గన్లతో ఇచ్చిన నీరు కేవలం 5 మిల్లీమీటర్ల వర్షపాతంతో సమానం. ముఖ్యమంత్రి చెప్పినట్టు కేవలం నాలుగు రోజుల్లో 4 లక్షల హెక్టార్లలో పంటలను కాపాడాలంటే 20 లక్షల ట్యాంకర్లు కావాల్సి ఉంటుంది. రాష్ట్రం మొత్తం వెతికినా ఇన్ని ట్యాంకర్లు గానీ, నీళ్లు గానీ కనిపించవు. అంటే నీరు, ట్రాక్టర్లు లేకుండా రెయిన్ గన్లు కొనుగోలు చేసి, కమీషన్లు మింగేశారే తప్ప వాటివల్ల దమ్మిడీ ప్రయోజనం లేకుండా చేశారు. రైతులకు సగం సబ్సిడీ.. రెయిన్ గన్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇస్తుంది. రైతులే కొనుక్కుంటామంటే వారికున్న పొలాన్ని బట్టి రాయితీ ఇస్తుంది. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు 90 శాతం, ఆపైన ఉండే వారికి 50 శాతం రాయితీ ఇవ్వాలన్నది ప్రభుత్వ పాలసీ.. ఎకరా పంటపై నీటిని చల్లేందుకు రూ.3 వేల వ్యయం అవుతుందని అంచనా వేసి ఇందులో సగం అంటే రూ.1,500లను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందన్నమాట. రైతులు కొనగా మిగిలిన రెయిన్ గన్స్ను ప్రభుత్వమే భద్రపరచాల్సి ఉంది. ఈ రెయిన్ గన్స్ కిట్లను వ్యవసాయ శాఖ గోదాములలో భద్రపరిచినట్లు శాసనసభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. వీటి నిర్వహణకు 103 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా తెలిపింది. వాస్తవానికి రెయిన్గన్స్ను రైతులెవరూ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అన్నీ టీడీపీ నేతల ఇళ్లకు చేరిపోయాయి. 2016 ఆగస్టు 28 ‘‘వరుణ దేవుడు కరుణించకపోయినా మీరెవరూ భయపడాల్సిన పని లేదు. వర్షం కురవకపోయినా రెయిన్ గన్లతో వర్షం కురిపిస్తా. మీ పంటను కాపాడే బాధ్యత నాదీ’’ – అనంతపురం జిల్లా గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న పొలంలో రెయిన్ గన్ను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట 2016 సెప్టెంబర్ 12 ‘‘చంద్రబాబు వస్తారని ఆగస్టు 27 రాత్రి నా పొలం పక్కన ఓ కుంట తవ్వారు. అందులో ప్లాస్టిక్ పట్టా వేసి ట్యాంకర్లతో నీటిని నింపారు. చంద్రబాబు వచ్చిన తర్వాత 10 నిమిషాలు రెయిన్గన్లు నడిపారు. ముఖ్యమంత్రి అటుపోగానే రెయిన్ గన్లతోపాటు పట్టాను, పైపులను తీసుకుపోయారు. ఐదు ఎకరాలకు రెండు ఫైరింజన్ల నీళ్లు ఏం సరిపోతాయి? పంట పూర్తిగా ఎండిపోయింది. బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలసవెళ్లా’’ – శివన్న, రైతు, గుండువారిపల్లి, ఆమడగూడూరు మండలం, అనంతపురం జిల్లా 2018 డిసెంబర్ 26 ‘‘రెయిన్ గన్లతో లక్షలాది ఎకరాల్లో పంటలను కాపాడాం. ప్రస్తుతం రబీలో అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాలో సైతం 15,296 హెక్టార్లలో పంటలకు తడులు అందించాం’’ – వ్యవసాయ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు -
సునీతమ్మా.. రెయిన్గన్ల డ్రామా ఇకచాలు
పంటతడి పేరుతో గతేడాది దోపిడీ – రూ.కోట్లు ఖర్చు చేశారు.. ఎన్నెకరాలు కాపాడారో శ్వేతపత్రం విడుదల చేయాలి – వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం: మంత్రి పరిటాల సునీత రెయిన్గన్లతో వేరుశనగ పంటను కాపాడుతామంటూ మళ్లీ కొత్త డ్రామాకు తెర తీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది రెయిన్గన్లకు సుమారు రూ.300–400 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి రెయిన్గన్లు స్విచ్ఆన్ చేసిన పొలంలోనే పంట ఎండిపోయిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మళ్లీ రెయిన్గన్ల ద్వారా పంటలకు తడులిస్తామని మంత్రి పరిటాల సునీత చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెయిన్గన్లతో గతేడాది ఎన్ని ఎకరాల్లో వేరుశనగ పంటను కాపాడారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగాళ్లను చేస్తోందన్నారు. టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇన్పుట్ సబ్సిడీ రాయండి దొరా అని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దివంగత వైఎస్ హంద్రీ–నీవా, పీఏబీఆర్ ద్వారా అనంత జిల్లాను సస్యశ్యామలం చేయాలని భావించారన్నారు. టీడీపీ ప్రభుత్వం.. హంద్రీ–నీవా నుంచి దాదాపు 3.50 లక్షల ఎకరాలు, పీఏబీఆర్ ద్వారా 1.50 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిఉంటే రైతులకు ఇలాంటి దయనీయ స్థితి వచ్చేది కాదన్నారు. జిల్లాలో 50 శాతం మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ జమకాలేదన్నారు. భూమి లేని టీడీపీ కార్యకర్తలు ఖాతాలు, దొంగ పాసు పుస్తకాలు సృష్టించి ఇన్పుట్ సబ్సిడీ దోచుకున్నారన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు బిల్లే ఈశ్వరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాలో రైతు ఏరువాక ప్రారంభానికి వచ్చిన రెండేళ్లు వర్షాలు కురవలేదనే విషయాన్ని రైతులు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. సమావేశంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, పార్టీ నాయకులు ఓబుళపతి, నరసింహారెడ్డి, వాసుదేవరెడ్డి, పవన్, శివారెడ్డి, రాజా, అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. -
రిక‘వర్రీ’
– ‘పంట సంజీవని’ పరికరాల స్వాధీనంలో అవకతవకలు – రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్లు, పైపులు తమవద్దే పెట్టుకున్న టీడీపీ నేతలు – రివకరీకి వెళ్లిన అధికారులతో ఘర్షణ – విధిలేక రైతులపై కేసు నమోదు చేస్తున్న అధికారులు సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘పంట సంజీవని’ పేరుతో పంటలను కాపాడేందుకు కొనుగోలు చేసిన పరికరాల రికవరీలో గోల్మాల్ జరుగుతోంది. అదునులో తీసుకున్న పరికరాలను అవసరం తీరాక అధికారులకు ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు నానాయాగీ చేస్తున్నారు. తీసుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ ‘రికవరీ’ కోసం అధికారులు పల్లెల్లోకి వెళితే వారినీ దుర్భాషలాడుతున్నారు. వారి బెదిరింపులు తాళలేక, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక వ్యవసాయాధికారులు రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో పల్లెల్లో రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. ప్రణాళిక లేకుండా పంపిణీ గతేడాది ఖరీఫ్లో జిల్లాలో 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. జూలై ఆఖరు, ఆగస్టులో వర్షాభావంతో పంట ఎండిపోయింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రక్షక తడుల ద్వారా పంటలను కాపాడతామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. జూలైలోనే రెయిన్గన్లు జిల్లాకు చేరాయి. అయితే కృష్ణా పుష్కరాల హడావుడిలో ఉన్న యంత్రాంగం వీటిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేసింది. సీఎం ఆగస్టులో ధర్మవరంలో పర్యటించినా, ఆతర్వాత అనంతపురంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్నప్పుడు కూడా అధికారులు వీటిని పంపిణీ చేయించలేదు. పంటలు ఎండిన సంగతి తెలిసి వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో ఆగస్టు 22న రెయిన్గన్లను రైతులకు పంపిణీ చేశారు. అప్పటికే పంట పూర్తిగా ఎండిపోయింది. ఆగస్టు 28న సీఎం ‘అనంత’ పర్యటనకు వచ్చి పంట ఎండిన సంగతి తనకు తెలీదని, తెలిసుంటే కాపాడేవాళ్లమని చెప్పారు. రెయిన్గన్లను రైతులకు ఇచ్చి పంటను కాపాడాలని ‘మిషన్ - 1’ పేరుతో హడావుడి చేశారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకూ జిల్లాలోనే మకాం వేశారు. సీఎం ఒత్తిడితో అధికారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఓ ప్రణాళిక లేకుండా పంట సంజీవని పరికరాలను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. కొన్నిచోట్ల రైతుల వద్ద పాస్పుస్తకాలు తీసుకుని పంపిణీ చేస్తే, ఇంకొన్ని చోట్ల పేర్లు రాసుకుని ఇచ్చేశారు. ఇలా 5,887 రెయిన్గన్లు, 5,495 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4,478 ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటికి రూ.67 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ నేతలను వదిలి రైతులపై కేసులు రెయిన్గన్లను రైతులు తమ పనిని ముగించుకొని మరో రైతుకు ఇచ్చారు. ఆ రైతు ఇంకో రైతుకు ఇచ్చారు. ఇలా అవి చేతులు మారాయి. ఈ ప్రక్రియ స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగింది. వారి వద్దకు ఎవరు వెళితే వారికే ఇచ్చారు. మిషన్ - 1, మిషన్ - 2 పూర్తయిన తర్వాత రెయిన్గన్ల రికవరీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత వీటిని అధికారపార్టీ నేతలు కర్ణాటకలోని రైతులకు విక్రయించారు. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో అధికారులు రికవరీపై దృష్టి సారించారు. ఏఓలు, ఎంపీఈఓలను క్షేత్రస్థాయికి పంపారు. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయని వారు గ్రహించారు. కొందరు నేతలు పరికరాలు వెనక్కి ఇచ్చేశారు. ఇంకొందరు పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసినవి కాకుండా వేరేవి, పని చేయకుండా తుక్కుగా ఉన్న ఆయిల్ ఇంజన్లను ఇస్తున్నారు. ఇప్పటివరకు రికవరీ అయిన పరికరాలు కాకుండా ఇంకా 800 రెయిన్గన్లు, 1,473 స్ప్రింక్లర్లు, 91,880 పైపులు, 414 ఇంజన్లు రికవరీ కావాల్సి ఉంది. వీటిని సేకరించడం అధికారులకు తలనొప్పిగా మారింది. వీటిపై ఆరా తీసే ఏఓలు, ఎంపీఈఓలపై అధికార పార్టీ నేతలు దుర్భాషలాడుతున్నారు. ఎంపీఈఓలలో అధిక శాతం మహిళలు ఏం చేయాలో దిక్కుతోచక వెనుదిరుగుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేసులు నమోదు చేయాలని మొదట వ్యవసాయాధికారులు భావించినప్పటికీ సంబంధిత నేతలు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్ల శరణు కోరారు. దీంతో కేసులు నమోదు చేయొద్దని, చేస్తే బదిలీ తప్పదని ఎమ్మెల్యేలు ఏఓలను హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులంతా రైతులపై పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు, వీర్ఓలు గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. తమవద్ద లేవన్నా వినడం లేదు. పరికరాలు ఇవ్వకపోతే బ్యాంకులో పంటరుణం ఇవ్వకుండా ‘బ్యాన్’ చేసేలా సిఫార్సు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో రైతులు తాము ఇచ్చిన రైతుల వద్దకు వెళ్లి పరికరాలు అడగడం, వారు మరో రైతుపై చెప్పడం ఇలా గ్రామాల్లో ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. అధికారులు మాత్రం రైతులపైనే ఫిర్యాదు చేసి ముందుకెళ్తున్నారు. కదిరి, కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర నియోజకవర్గాల్లో అధికంగా రికవరీ కావాల్సి ఉంది. పంట సంజీవని పరికరాల పరిస్థితి ఇదీ రెయిన్గన్లు స్ప్రింక్లర్లు పైపులు ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేసినవి 5,887 5,495 4,17,000 4,478 రికవరీ అయినవి 5,087 4,022 3,25,120 4,064 రికవరీ కావల్సినవి 800 1,473 91,880 414 రికవరీ చేస్తున్నాం పంట సంజీవని పరికరాల రికవరీ కష్టంగా ఉంది. అయినా చేస్తున్నాం. రైతులపై పోలీసులకు, తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం. కొందరు పగిలిన పైపులు, పనిచేయని ఇంజన్లు ఇస్తున్నారు. వీటిని సబ్సిడీ ద్వారా తమకే ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాలో ఉన్న పరికరాలను శోధించి రికవరీ చేస్తాం. తక్కిన వాటిపై ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాం. - శ్రీరామమూర్తి, జేడీఏ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement