సాగర్లో మంత్రుల ఘోరావ్
హాలియా : కృష్ణాపుష్కరాల సందర్భంగా నాగార్జునసాగర్లో మీడియా ప్రతినిధులపై పోలీసులు పెడుతున్న ఆంక్షలకు నిరసనగా మంగళవారం శివాలయం ఘాట్ వద్ద మీడియా ప్రతినిధులు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డిల ఘఘోరావ్ చేశారు.
హాలియా : కృష్ణాపుష్కరాల సందర్భంగా నాగార్జునసాగర్లో మీడియా ప్రతినిధులపై పోలీసులు పెడుతున్న ఆంక్షలకు నిరసనగా మంగళవారం శివాలయం ఘాట్ వద్ద మీడియా ప్రతినిధులు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డిల ఘఘోరావ్ చేశారు. ఈసందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ తమపై పోలీసులు ఆంక్షలు విధించడమే కాకుండా గుర్తింపు పాస్లు ఉన్నప్పటికీ ప్రతి చెకింగ్ పాయింట్ వద్ద ఆపి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రులు మీడియా ప్రతినిధులను అన్ని ఘాట్లకు అనుమతించాలని ఆదేశించారు.