మంత్రి చూసుకుంటారు.. | minister see every thing | Sakshi
Sakshi News home page

మంత్రి చూసుకుంటారు..

Aug 25 2016 10:37 PM | Updated on Sep 4 2017 10:52 AM

ఎల్లారెడ్డిపేట: సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఎల్లారెడ్డిపేటలో అఖిల పక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతుండగా దీక్ష శిబిరాన్ని గురువారం జెడ్పీటీసీ తోట ఆగయ్య సందర్శించారు. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న వారితో ఆయన మాట్లాడుతూ జిల్లా విషయం మంత్రి చూసుకుంటారని అన్నారు.

ఎల్లారెడ్డిపేట: సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఎల్లారెడ్డిపేటలో అఖిల పక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతుండగా దీక్ష శిబిరాన్ని గురువారం జెడ్పీటీసీ తోట ఆగయ్య సందర్శించారు. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న వారితో ఆయన మాట్లాడుతూ జిల్లా విషయం మంత్రి చూసుకుంటారని అన్నారు.  దీక్షలు విరమించి మంత్రి దగ్గరికి వెళ్లి జిల్లా విషయం మాట్లాడదామని అన్నారు. దీనిపై అఖిలపక్షం నాయకులు స్పందిస్తూ జిల్లా విషయంలో మంత్రి స్పష్టమైన ప్రకటన ఇస్తేనే ఆందోళనను విరమిస్తామని తేల్చి చెప్పారు. మంత్రిపై ఒత్తిడి తేవాలని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జెడ్పీటీసీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ కొండ రమేశ్‌గౌడ్, డివిజన్‌ కన్వీనర్‌ రంజిత్, వాజీద్, శ్రీనివాస్, రాఖేష్, నవీన్, ప్రవీన్, బండారి బాల్‌రెడ్డి, బుగ్గారెడ్డి, దొమ్మాటి నర్సయ్య, ఎస్‌కే గౌస్‌  పాల్గొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement