మెదక్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన కోరిక తీర్చలేదన్న కోపంతో వివాహితను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంచార్జ్ డీఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలం లక్ష్మిసాగర్ పంచాయతీ సువాలీ తండాకు చెందిన గోరాం సురేష్, సుశీల (30) దంపతులు సంగారెడ్డిలో అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే, బస్వాపూర్ గ్రామానికి చెందిన వెండికోలు రాజు కొంతకాలంగా సుశీలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో పనులకు వెళ్లిన రాజు, సుశీల ఒకే బస్సులో స్వగ్రామానికి వచ్చారు.అదే రోజు సాయంత్రం ముదిమాణిక్యం గ్రామంలో సుశీల, బస్వాపూర్లో రాజు బస్సు దిగి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే రాజు సుశీలకు ఫోన్ చేసి ముదిమాణిక్యం వద్దనే ఉండాలని ఆమెకు సూచించాడు. అయితే అప్పుడే సుశీలకు భర్త సురేష్ ఫోన్ చేసి.. నడుచుకుంటూ ముందుకు రావాలని, తాను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో వెంటనే ఆమె ఆ విషయాన్ని రాజుకు తెలిపింది. రాజు మాత్రం తాను వచ్చేంతవరకు అక్కడే ఉండాలని పట్టుబట్టాడు. ఆమె వినకుండా ముదిమాణిక్యం నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న సువాలీ తండా వైపు నడిచి వెళుతోంది. రాజు ఫోన్ చేస్తుంటే ఆమె కట్ చేసింది. అంతలోనే అక్కడికి బైక్పై చేరుకున్న రాజు... ఆమెను అడ్డగించాడు. తన భర్త వస్తున్నాడు వెళ్లిపోవాలని ఆమె ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా కోరిక తీర్చాలంటూ గొడవకు దిగాడు.
ఆమె ప్రతిఘటించటంతో పక్కనే ఉన్న విద్యుత్ వైరుతో ఆమె గొంతు బిగించి చంపేశాడు. మృతదేహాన్ని దగ్గరలోని బావిలోకి తోసేసి తన ఇంటికి వెళ్లి వెళ్లిపోయాడు. భర్త సురేష్ రాత్రంతా వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. మరుసటిరోజు ఉదయం తండా మార్గమధ్యంలో భార్య కాలిచెప్పును గుర్తు పట్టి వెతకగా పాడుబావిలో శవమై కనిపించింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలి ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిగా వెండికోలు రాజును అనుమానించి విచారించారు. సుశీలతో రెండు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అతడు విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
కోరిక తీర్చలేదని ప్రియుడే కడతేర్చాడు
Published Wed, Jun 8 2016 7:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement