క్షణాల్లో బూడిదైంది | massive fire | Sakshi
Sakshi News home page

క్షణాల్లో బూడిదైంది

Feb 14 2017 1:52 AM | Updated on Aug 21 2018 2:46 PM

అనంతపురం సెంట్రల్‌ : నగరంలోని నేషనల్‌పార్కు సమీపంలోని సుఖదేవ్‌నగర్‌లో ఉన్న గుజిరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఖాదర్‌బాషా, ఆయన కుమారుడు నూర్‌బాబా గుజిరీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. నేషనల్‌ పార్కు సమీపంలో జాతీయరహదారి పక్కన గుజిరీ నిర్వహిస్తున్నారు.

= గుజిరీలో భారీ అగ్నిప్రమాదం  
= రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం  
అనంతపురం సెంట్రల్‌ : నగరంలోని నేషనల్‌పార్కు సమీపంలోని సుఖదేవ్‌నగర్‌లో ఉన్న గుజిరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఖాదర్‌బాషా, ఆయన కుమారుడు నూర్‌బాబా గుజిరీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. నేషనల్‌ పార్కు సమీపంలో జాతీయరహదారి పక్కన గుజిరీ నిర్వహిస్తున్నారు. వాడి పడేసిన వాటర్‌ బాటిâýæ్లను ఎగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. సోమవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు గుజిరీకి నిప్పంటుకుంది.

నిర్వాహకులు గమనించి వెంటనే ఫైరింజి¯ŒSకు సమాచారమందించారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ కావడం, ఆరుబయట గుజిరీ ఉండడంతో అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చేలోపు గాలి వ్యాపించి నిమిషాల్లో మంటలు గుజిరీ అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో    అగ్రిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడానికి వీలులేకుండా పోయింది. మంటల్లో దాదాపు 80 శాతం గుజిరీ కాలిపోయింది. రెండు ఫైరింజిన్లు వచ్చి మంటలు అదుపు చేసినా ఫలితం లేకపోయింది. గుజిరీ మొత్తం కాలిబూడిద కావడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

బాధితుడు నూర్‌బాబా మాట్లాడుతూ దాదాపు రూ.20 లక్షలకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు. షార్టుసర్క్యూట్‌ వల్ల జరిగిందా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్నది తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరాడు. స్టేష¯ŒS ఫైర్‌ ఆఫీసర్‌ కేపీ లింగమయ్య నష్టం అంచనా వేశారు.    దాదాపు రూ.10 లక్షలకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లి ఉండొచ్చని భావించారు.   

Advertisement
 
Advertisement
Advertisement