కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్.ఐ. ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం యేజర్ల జయలక్ష్మి (25) శంషీగూడలో నివాసముంటోంది. గత సంవత్సర కాలంగా కడుపునొప్పితో ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం కడుపునొప్పి విపరీతంగా రావటంతో బాధను భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పు రేకులకు ఉన్న రాడ్కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మల్యాద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.