మార్కెట్‌ను ముంచెత్తిన బీరకాయలు | marketnu munchettina birakayalu | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ను ముంచెత్తిన బీరకాయలు

Aug 15 2016 12:29 AM | Updated on Sep 4 2017 9:17 AM

బీరకాయలు మార్కెట్‌ను ముంచెత్తాయి. దీంతో ధర బాగా తగ్గింది. ఆదివారం తాడేపల్లిగూడెం మార్కెట్‌లో ధరలు ఇలా ఉన్నాయి. వారం రోజుల క్రితం కిలో రూ.40 పలికిన బీరకాయలు కిలో రూ.20కి పడిపోయింది. నాసిరకం బీరకాయలు కిలో రూ.8కే లభించాయి.

తాడేపల్లిగూడెం : బీరకాయలు మార్కెట్‌ను ముంచెత్తాయి. దీంతో ధర బాగా తగ్గింది. ఆదివారం తాడేపల్లిగూడెం మార్కెట్‌లో ధరలు ఇలా ఉన్నాయి. వారం రోజుల క్రితం కిలో రూ.40 పలికిన బీరకాయలు కిలో రూ.20కి పడిపోయింది. నాసిరకం బీరకాయలు కిలో రూ.8కే   లభించాయి. బెండకాయలు కిలో రూ. 12 , దొండకాయలు రూ.24కి అమ్మారు. క్యాబేజీ, దోసకాయలు  కిలో రూ.12, కంద కిలో రూ.24కి అమ్మారు. టమాటాలు  కిలో రూ.12, బీట్‌రూట్‌ కిలో రూ.24కు లభించింది. క్యాప్సికం కిలో రూ.120, బీన్స్‌ కిలో రూ.80కి విక్రయించారు. కీరా కిలో రూ.32, నాటురకం చిక్కుడుకాయలు కిలో రూ.80, ఇతర రకం చిక్కుడుకాయలు కిలో రూ.16కు లభించాయి. గోరు చిక్కుళ్లు రూ.24, క్యారట్‌ రూ.40కి విక్రయించారు. తెల్ల వంకాయలు రూ.40, నల్ల వంకాయలు రూ.30కి లభ్యమయ్యాయి. ఉల్లిపాయలు నాలుగు కిలోలు రూ.50కే అమ్మారు. కర్నూలు నుంచి కొత్త ఉల్లిపాయలు వచ్చాయి. 40 లారీల సరుకు వచ్చింది. గుత్తగా క్వింటాలు రూ.400 నుంచి రూ.850 చేసి అమ్మకాలు సాగించారు. పాతరకం మహారాష్ట్ర ఉల్లిపాయలు కిలో రూ.16 చేసి విక్రయించారు. గుత్తగా క్వింటాల్‌ ఈ రకం ఉల్లిపాయలు రూ. 600 నుంచి రూ.1,200 విక్రయించారు.  బంగాళాదుంపలు కిలో రూ.24 పలికాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement