ఒక రైల్లో నుంచి మరో రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలు కిందపడి మృతిచెందాడు.
ఒక రైల్లో నుంచి మరో రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలు కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా మదనాపురం- వనపర్తిరోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వనపర్తికి చెందిన రాములు(45) అనే వ్యక్తి గుంటూరు రైల్వే ప్యాసింజర్ ఎక్కే క్రమంలో.. ప్రమాదవశాత్తు దాని కిందపడి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.