రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 32 మంది విద్యార్థులపై ఫ్లయింగ్ స్క్వాడ్ కేసులు నమోదు చేసింది.
డిగ్రీ పరీక్షల్లో 32 మందిపై మాల్ ప్రాక్టీసు కేసులు
Mar 30 2017 11:29 PM | Updated on Sep 5 2017 7:30 AM
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 32 మంది విద్యార్థులపై ఫ్లయింగ్ స్క్వాడ్ కేసులు నమోదు చేసింది. గురువారం.. కోడుమూరు సాయిరాం డిగ్రీ కళాశాలలో 18 మంది విద్యార్థులు, వివేకానంద డిగ్రీ కళాశాలలో 11 మంది విద్యార్థులు, గూడూరు సాయిరాం డిగ్రీ కళాశాలలలో ముగ్గురు విద్యార్థులపై పరీక్షల తనిఖీ అధికారులు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల విభాగాధిపతి వెంకటేశ్వర్లు తెలిపారు.
Advertisement
Advertisement