తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం
ఏలూరు (ఆర్ఆర్ పేట): తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టును దేశానికే ఆదర్శవంతంగా నిలిపే దిశగా జిల్లా యంత్రాంగం కషి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి కోరారు.
ఏలూరు (ఆర్ఆర్ పేట): తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టును దేశానికే ఆదర్శవంతంగా నిలిపే దిశగా జిల్లా యంత్రాంగం కషి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్మార్ట్ పల్స్ సర్వే పూర్తవుతున్న తరుణంలో జిల్లాలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించుకుని సర్వేను అర్థవంతంగా నిర్వహించాలన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం దేశంలో మరో నాలుగు జిల్లాలతో పాటు పశ్చిమగోదావరిను పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖలు నిర్వహిస్తున్న పలు రిజిస్టర్ల నిర్వాహణకు స్వస్తి పలికి ఆన్లైన్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించదలిచామన్నారు. దేశంలో ఐదు జిల్లాలు 11 వేల అంగన్వాడీ కేంద్రాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు. దీనిలో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇస్తారని, ప్రాజెక్ట్లో భాగంగా 55 వేల ట్యాబ్లను సిద్ధం చేస్తున్నట్టు ఆమె చెప్పారు.
60 రోజుల్లో పూర్తిచేస్తాం
కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్ట్కు జిల్లా ఎంపిక కావడం ఆనందించదగిన విషయమని, 60 రోజుల్లో ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని చెప్పారు. ఐసీడీఎస్ పరిధిలో 18 ప్రాజెక్టులు, 46 బ్లాక్ల్లో 10 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి, కేంద్ర ప్రభుత్వ అధికారులుధర్మపాల్, ముష్రఫ్ ఫారూఖ్, కుల్వంత్సింగ్, యష్పాల్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డెప్యూటీ డైరెక్టర్ రాజశేఖరరెడ్డి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డెప్యూటీ డైరెక్టర్ సంజీవకుమార్, న్యూఢిల్లీ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్కుమార్, ఐటీ నిపుణులు రత్నాకర్, అనూష్గుప్తా, న్యూట్రిషన్ కన్సల్టెంట్ లక్ష్మి, శ్రీకాంత్, డీఎంహెచ్వో కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.