గుండాల : మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న జల ఒప్పందం చరిత్రాత్మకంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమైక్యాంధ్ర నాయకులు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. 40 సంవత్సరాలుగా వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నప్పటికీ తెలంగాణకు చుక్క నీరు ఇవ్వని అసమర్థులు కాంగ్రెస్ వారు అని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ కుదుర్చుకున్న 3 బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని, అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్కుమార్రెడ్డి, జీవన్రెడ్డి, భట్టి విక్రమార్కలు లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కానుందని కాలేశ్వరం ప్రాజెక్టుతో గంధమల్ల , బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఆలేరు భువనగిరి నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నట్లు ఆమె తెలిపారు. కొత్త ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేసి సాగు నీరు అందిస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిందం ప్రకాశ్, జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ గార్లపాటి సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి, కో–ఆఫ్షన్ మెంబర్ ఎండీ షర్పోద్దీన్, నాయకులు మూగల శ్రీనువాస్, ఇమ్మడి దశరథ, లగ్గాని రమేష్, తదితరులు ఉన్నారు.
Related news
-
ఫ్లిప్కార్ట్ గుడ్న్యూస్.. ఇక హైదరాబాద్లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను ఇప్పుడు హైదరాబాద్కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను కొత్తగా హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్ట్రిప్లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్ట్రిప్ హోటల్ బుకింగ్లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లేదా యాప్ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్ఫామ్కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
ఏపీ ఎన్నికల వేళ తెరపైకి వివేకా కేసు
తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు పొంతన లేదు. పైగా ఉన్నపళంగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకోవడంతో.. ఆమె ఏ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడుతుందో స్పష్టమవుతోంది. ఇక వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. అలాంటప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమి సంబంధం ఉంది?.. సంబంధం అంటగడుతూ ఈనాడు ఎందుకు కథనాలు ఇవ్వాలి? ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆ మధ్య ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది. అదే సమయంలో.. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒకటిన్నర పేజీలు ప్రచురించడం వెనుక ఆంతర్యం ఏంటసలు?.. సునీత ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతిలాంటి టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలు కొన్ని.. మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్ జగన్ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా? అవినాష్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు? అవినాశ్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? సునీత నుంచి సమాధానాలేవీ? ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా?.. ఆ దుర్బుద్ధి బయటపడిందిలా.. వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాష్ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది. ఇదీ చదవండి: వివేకా వర్థంతిన సునీత రాజకీయం! ఆ లేఖ దాచింది నర్రెడ్డి దంపతులు కాదా? ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు. పెద్ద మనుషుల ముసుగులో కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజు, వివేకా కేసులో షర్మిల, సునీత, లాంటి వాళ్లను మార్చుకుని ఎన్నికలకు వెళ్తున్నారుఘ ఈ క్రమంలోనే సీఎం జగన్పై జరుగుతున్న కుట్రలో భాగంగా తెరపైకి వచ్చిందే.. వివేకా హత్య కేసు. ఈ కుట్రలో ఈనాడు అధినేత రామోజీరావు కూడా భాగమే అయ్యారు. ‘‘వివేకా హత్య జరిగి రేపటికి అయిదేళ్లు.. అయినా కొలిక్కిరాని దర్యాప్తు.. కారణం జగనే!.. నిందితుల్ని కాపాడేందుకు సర్వశక్తుల ప్రయోగం’’ అంటూ అడ్డగోలు రాతలతో తాజాగా ఈనాడు ఇచ్చిన కథనమే ఇందుకు నిదర్శనం. ఈ కేసులో తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుందో.. అవే నర్రెడ్డి సునీత నుంచి మొదటి నుంచి చేస్తోంది. పైగా ఆమె స్టేట్మెంట్ను టీడీపీ అనుకూల మీడియా సంస్థలు హైలైట్ చేస్తూ వస్తున్నాయి. అందునా ఈమధ్య చంద్రబాబుకి, టీడీపీ అండ్ మిత్రపక్ష నేతలకు ఆమె ఢిల్లీ ప్రెస్ మీట్లో కృతజ్ఞతలు చెప్పారు. అయితే.. సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల్నే ప్రముఖంగా ప్రస్తావించిన రామోజీ మీడియా.. బాబు అండ్ కోకి ఆమె చెప్పిన కృతజ్ఞతల్ని పట్టించుకోలేదు. వీటన్నంటికి తోడు.. వివేకా వర్థంతి నాడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ప్రకటన చేయాలని ఆమె నిర్ణయించుకోవడం, టీడీపీ తరఫునే బరిలోకి దిగాలని ఆమె ప్రయత్నిస్తుండడం.. ఇవన్నీ చూశాక ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరిగింది కాదంటే ఎవరైనా నమ్మగలరా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చిన్నారిని చిదిమేసిన కారు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు..
రాజన్న సిరిసిల్ల: మండలంలోని గాజులపల్లిలో ఆరేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు చిదిమేసింది. ఈ ప్రమాదంలో చుట్టపుచూపుగా వచ్చిన చిన్నారి మృతితో గాజు లపల్లిలో విషాదం నిండింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన కొట్టెం పద్మ–రామారావు దంపతుల కూతురు స్వాతి(6)తో కలిసి గాజులపల్లిలో ఉంటున్న సమీప బంధువుల ఇంటికి ఆదివారం వచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ ప్రముఖుడు తన కారులో సిరిసిల్ల నుంచి మండల కేంద్రానికి వస్తుండగా రోడ్డు దాటుతున్న స్వాతిని అతివేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల పగిలిపోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్సై రమాకాంత్ అక్కడికి చేరుకొని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్వాతి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ కుటుంబీకులు, గ్రామస్తులు సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డుపై ధర్నా చేశారు. -
వంద అడుగుల ‘కొండెంగలొద్ది’ పరుగెడుతున్న అగర్గూడ, గుండాల జలపాతాలు
► జాలువారే జలపాతాలు పెంచికల్పేట్ మండలం అగర్గూడ అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి దూకే జలధార ఇది. పెంచికల్పేట్ నుంచి అగర్గూడకు 7 కి.మీ.లు వాహనంలో వెళ్లి, మరో ఐదు కి.మీ.లు నడవాలి. తిర్యాణి మండలం గుండాల గ్రామ పంచాయతీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. 50 అడుగుల కొండవాలు నుంచి జాలువారుతోంది. తిర్యాణి నుంచి 10 కి.మీ.ల దూరంలో గల రొంపల్లి వరకు వాహనాల్లో వెళ్లొచ్చు. తర్వాత దట్టమైన అడవిలో ఆరు కి.మీ.లు కాలినడకన వెళ్లాలి. -
సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్లోని కీలక మిలటరీ బేస్నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది.
Related News by category
-
కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూర్యాపేట : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదని.. ఆ పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 20 నుంచి 25 మంది త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని ఉత్తమ్ జోస్యం చెప్పారు. 10 ఏళ్లు తెలంగాణను బీఆర్ఎస్ మోసం చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కనీస న్యాయం జరగలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు 15 ఎంపీ స్థానాలు దక్కుతాయని, నల్లగొండ అభ్యర్థి రఘువీర్రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మాట్లాడుతూ పేటలో కాంగ్రెస్ బలంగా ఉందని, అనుబంధ సంఘాలు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కె.రఘువీర్రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, సూర్యాపేట, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, శంకర్నాయక్, ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, తండు శ్రీనివాస్యాదవ్, చకిలం రాజేశ్వర్రావు, కొప్పుల వేణారెడ్డి, పెద్దిరెడ్డి రాజా, కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకానికి ప్రభుత్వ భూమి!
ఫ పేదల భూమిపై పెద్దల కన్ను ఫ అనధికారిక కమిటీతో భూ పంపిణీకి కసరత్తు ఫ 73 గజాల ప్లాట్కు రూ.70 వేలు ఇవ్వాలని హుకుం జారీ ఫ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ ఫ మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలో కొందరి నిర్వాకం మిర్యాలగూడ: పేదల ఇళ్ల స్థలాల కోసం ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను అమ్మకానికి పెట్టారు కొందరు పెద్దలు. గతంలో ఇల్లు కట్టుకోలేకపోయిన వారి స్థలాలతోపాటు ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్న వారు కూడా కొంత డబ్బు చెల్లిస్తేనే ఆ స్థలాలు, ఇళ్లు మీకు దక్కుతాయని, లేదంటే వేరే వాళ్లకు కేటాయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ తతంగం మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామంలోని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇరవై ఏళ్ల క్రితం స్థానికంగా సర్వేనంబర్ 437లో 4.24 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 20 మందికి వంద గజాల చొప్పున పంపిణీ చేసింది. ఇందులో ఐదారుగురు మాత్రమే ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు కట్టుకోగా కొందరు బేస్మెంట్ లెవల్, కొందరు కంచె వేసుకొని ఇంటి స్థలాన్ని ఆపుకున్నారు. ఇందులో ఇంకా 3 ఎకరాల భూమి మిగిలి ఉంది. దీనిపై స్థానిక నాయకుల కన్ను పడింది. ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని పథకం పన్నారు. దీంతో అనధికారికంగా 14 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి గతంలో ప్రభుత్వం పంపణీ చేయగా మిగిలిన భూమిని పేదలకు పంచుతామని ప్రకటించారు. ఈ నెల 23న లబ్ధిదారుల ఎంపిక చేస్తామని, అర్హుల పేర్లు సేకరిస్తూ ఒక్కొక్కరి నుంచి ఎంట్రీ ఫీజుగా రూ.1,500 వసూలు చేశారు. మొత్తం 190 మందికి 73 గజాల చొప్పున ఇస్తామని నిర్ణయించారు. ఇందుకు గ్రామ కమిటీకి గుండుగుత్తగా మొత్తం రూ.70 వేలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో వంద గజాలు కేటాయించిన 20 మంది లబ్ధిదారుల నుంచి 73గజాలు పోను మిగతా వాటికి డబ్బులు అయినా కట్టండి లేదా భూమినైనా వదిలి పెట్టండని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఇదీకాక వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులను సైతం డైబ్బెవేల రూపాయలు కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్పటి లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని గ్రామానికి చెందిన పేదలు కోరుతున్నారు. డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకోవాలట.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నాకు ప్రభుత్వం ఇంటి స్థలం వచ్చింది. అప్పట్లో ఇల్లు కట్టుకోవాలని బేస్మెట్ నిర్మాణం చేశాను. కానీ, ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేక అలానే వదిలేశాను. అదే బేస్మెట్పై నీవు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే రూ.70 వేలు ఇవ్వమని పెద్దమనుషులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఎదుకు డబ్బులివ్వాలో అర్థంకావట్లేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – ఆడోతు రవి, లక్ష్మీపురం -
రైలు పట్టాల సమీపంలో మంటలు
● పలు రైళ్ల రాకపోకలకు అంతరాయంమిర్యాలగూడ అర్బన్: రైలు పట్టాల సమీపంలో మంటలు వ్యాపించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కుక్కడం వద్ద చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం వద్ద రైలు పట్టాల సమీపంలో రైతులు ఎండిపోయిన వరి కొయ్యలకు నిప్పుపెట్టడంతో మంటలు క్రమంగా వ్యాపిస్తూ రైలు పట్టాల వద్దకు వచ్చాయి. దీంతో విషయాన్ని తెలుసుకున్న రైల్వే సిబ్బంది గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. మంటలను ఆర్పిన అనంతరం రైలు బయలుదేరి వెళ్లింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఎస్ఐ పేర్కొన్నారు. నీటి ఎద్దడి రాకుండా చూడాలి కేతేపల్లి: ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ టి.నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కేతేపల్లి, శాలిగౌరారం మండలాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులు, సిబ్బందితో సంయుక్తంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. తాగునీటి ట్యాంకులను నెలలో మూడు సార్లు శుభ్రం చేయించటంతో పాటు, లీకేజీ అయిన పైప్లైన్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ పనులు లేనందున అన్ని గ్రామాల్లో కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డీఎల్పీఓ వెంకటేశ్వర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు బి.శ్రీనివాసరావు, లక్ష్మినారాయణ, ఎంఈఓ నాగయ్య, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు శ్రీనివాస్, మౌనిక, ఐకేపీ ఏపీఎం యాదమ్మ, ఈజీఎస్ ఏపీఓ సురేందర్, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకం, ఆలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజ వాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవంతో పాటు శ్రీస్వామి, అమ్మవారి సేవలను ఊరేగించారు. వైభవంగా ఊంజలి సేవోత్సవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. ఆ తర్వాత ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. -
నా ఇంటిలో గెట్టు పెడుతున్నారు
ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. నా తండ్రి కాలం చేయడంతో ఆ ఇల్లు వారసత్వంగా నాకు వచ్చింది. ఇరవై ఏళ్లుగా ఇంటి పన్ను కడుతూనే ఉన్నా. కానీ, ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి ఆ స్థలం నీకు ఇవ్వాలంటే రూ.70 వేలు ఇవ్వు అని బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన చర్యలు తీసుకోవాలి. – తిప్పన క్రిష్ణారెడ్డి (లక్ష్మీపురం) ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఉపేక్షించం ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయం నా దృష్టికి రాలేదు. లక్ష్మీపురం గ్రామంలో సర్వే నంబర్ 437లో ఉన్న 4.24 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని 20 మంది లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారానే ఆ భూమిని పంపిణీ చేస్తాం. కబ్జాలకు పాల్పడితే రెవెన్యూ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రావు, ఆర్డీఓ, మిర్యాలగూడ -
రెండో రోజూ స్వల్పమే..
నల్లగొండ: నల్లగొండ లోక్సభ స్థానానికి రెండో రోజైన శుక్రవారం మరో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు నలుగురు అభ్యర్థులు ఆరుసెట్ల నామినేషన్లు దాఖలు చేయగా రెండో రోజు మాత్రం నలుగురు అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో రెండురోజుల్లో ఎనిమిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు నామినేషన్లను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన స్వీకరించారు. నామినేషన్లు సమర్పించింది వీరే.. రెండో రోజు స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో బండారు నాగరాజు, కిన్నెర యాదయ్య ఉన్నారు. అలాగే ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా తలారి రాంబాబు నామినేషన్ సమర్పించారు. మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) అభ్యర్ధిగా వసుకుల మట్టయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి తరఫున ఒక నామినేషన్ సెట్ దాఖలు కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఒకటి, ఇద్దరు రెండు సెట్ల చొప్పున, ప్రజావాణి పార్టీ, సోషలిస్టు పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఒక్కొక్కరు ఒక్కో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి ఎంపీ స్థానానికీ అంతంతే.. సాక్షి, యాదాద్రి: లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భువనగిరి స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్, బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్ చందునాయక్, రేకల సైదులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. మొదటి, రెండో రోజు కలిపి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు వేశారు. అట్టహాసంగా సీపీఎం అభ్యర్థి నామినేషన్ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జహంగీర్ వెంట సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండమడుగు నర్సింహ ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే జన సమీకరణ చేయకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్ వేశారు. నల్లగొండ లోక్సభ స్థానానికి ఎనిమిది నామినేషన్లు రెండు రోజులు నలుగురు అభ్యర్థుల చొప్పున దాఖలు మొత్త పది సెట్ల నామినేషన్లు
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్?
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement