న్యాయవాదుల నిరసన | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల నిరసన

Published Sat, Aug 27 2016 12:47 AM

lawers bioct the corts in gadwal

 అలంపూర్‌: జోగుళాంబ జిల్లా పేరుతో గద్వాలను జిల్లాకేంద్రం చేయాలని చేపట్టిన 72 గంటల బంద్‌ శుక్రవారం సంపూర్ణంగా కొనసాగింది. అఖిలపక్ష కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, వ్యాపారదుకాణాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. అన్ని వసతులు ఉ్న గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రంలో న్యాయవాదులు రాజేశ్వరి, సురేష్‌ కుమార్, తిమ్మారెడ్డి, నాగరాజు యాదవ్, మహేష్‌ యాదవ్, మహేష్‌ ఉన్నారు.
 

Advertisement
Advertisement