Sakshi News home page

26న భూ నిర్వాసితులతో మహాధర్నా

Published Sat, Jul 23 2016 11:27 PM

26న భూ నిర్వాసితులతో మహాధర్నా

మిర్యాలగూడ : ప్రాజెక్టులు, పరిశ్రమలకు ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు పరిహారం చెల్లిస్తున్న 123 జీఓను రద్దు చేసి 2013 భూసేకకరణ చట్టాన్ని అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యాదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఈ నెల 26వ తేదీన తెలంగాణ భూనిర్వాసితులతో కలిసి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి నష్ట పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. భూ నిర్వాసితులు  ధర్నాకు తరలిరావాలని కోరారు. ధర్నాకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో సీపీఎ 

Advertisement

What’s your opinion

Advertisement