మిర్యాలగూడ : ప్రాజెక్టులు, పరిశ్రమలకు ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు పరిహారం చెల్లిస్తున్న 123 జీఓను రద్దు చేసి 2013 భూసేకకరణ చట్టాన్ని అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యాదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఈ నెల 26వ తేదీన తెలంగాణ భూనిర్వాసితులతో కలిసి హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నా వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి నష్ట పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులు ధర్నాకు తరలిరావాలని కోరారు. ధర్నాకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో సీపీఎ
26న భూ నిర్వాసితులతో మహాధర్నా
Published Sat, Jul 23 2016 11:27 PM
Related news
Related News by category
-
కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూర్యాపేట : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదని.. ఆ పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 20 నుంచి 25 మంది త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని ఉత్తమ్ జోస్యం చెప్పారు. 10 ఏళ్లు తెలంగాణను బీఆర్ఎస్ మోసం చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కనీస న్యాయం జరగలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు 15 ఎంపీ స్థానాలు దక్కుతాయని, నల్లగొండ అభ్యర్థి రఘువీర్రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మాట్లాడుతూ పేటలో కాంగ్రెస్ బలంగా ఉందని, అనుబంధ సంఘాలు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కె.రఘువీర్రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, సూర్యాపేట, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, శంకర్నాయక్, ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, తండు శ్రీనివాస్యాదవ్, చకిలం రాజేశ్వర్రావు, కొప్పుల వేణారెడ్డి, పెద్దిరెడ్డి రాజా, కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకానికి ప్రభుత్వ భూమి!
ఫ పేదల భూమిపై పెద్దల కన్ను ఫ అనధికారిక కమిటీతో భూ పంపిణీకి కసరత్తు ఫ 73 గజాల ప్లాట్కు రూ.70 వేలు ఇవ్వాలని హుకుం జారీ ఫ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ ఫ మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలో కొందరి నిర్వాకం మిర్యాలగూడ: పేదల ఇళ్ల స్థలాల కోసం ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను అమ్మకానికి పెట్టారు కొందరు పెద్దలు. గతంలో ఇల్లు కట్టుకోలేకపోయిన వారి స్థలాలతోపాటు ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్న వారు కూడా కొంత డబ్బు చెల్లిస్తేనే ఆ స్థలాలు, ఇళ్లు మీకు దక్కుతాయని, లేదంటే వేరే వాళ్లకు కేటాయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ తతంగం మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామంలోని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇరవై ఏళ్ల క్రితం స్థానికంగా సర్వేనంబర్ 437లో 4.24 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 20 మందికి వంద గజాల చొప్పున పంపిణీ చేసింది. ఇందులో ఐదారుగురు మాత్రమే ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు కట్టుకోగా కొందరు బేస్మెంట్ లెవల్, కొందరు కంచె వేసుకొని ఇంటి స్థలాన్ని ఆపుకున్నారు. ఇందులో ఇంకా 3 ఎకరాల భూమి మిగిలి ఉంది. దీనిపై స్థానిక నాయకుల కన్ను పడింది. ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని పథకం పన్నారు. దీంతో అనధికారికంగా 14 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి గతంలో ప్రభుత్వం పంపణీ చేయగా మిగిలిన భూమిని పేదలకు పంచుతామని ప్రకటించారు. ఈ నెల 23న లబ్ధిదారుల ఎంపిక చేస్తామని, అర్హుల పేర్లు సేకరిస్తూ ఒక్కొక్కరి నుంచి ఎంట్రీ ఫీజుగా రూ.1,500 వసూలు చేశారు. మొత్తం 190 మందికి 73 గజాల చొప్పున ఇస్తామని నిర్ణయించారు. ఇందుకు గ్రామ కమిటీకి గుండుగుత్తగా మొత్తం రూ.70 వేలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో వంద గజాలు కేటాయించిన 20 మంది లబ్ధిదారుల నుంచి 73గజాలు పోను మిగతా వాటికి డబ్బులు అయినా కట్టండి లేదా భూమినైనా వదిలి పెట్టండని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఇదీకాక వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులను సైతం డైబ్బెవేల రూపాయలు కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్పటి లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని గ్రామానికి చెందిన పేదలు కోరుతున్నారు. డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకోవాలట.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నాకు ప్రభుత్వం ఇంటి స్థలం వచ్చింది. అప్పట్లో ఇల్లు కట్టుకోవాలని బేస్మెట్ నిర్మాణం చేశాను. కానీ, ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేక అలానే వదిలేశాను. అదే బేస్మెట్పై నీవు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే రూ.70 వేలు ఇవ్వమని పెద్దమనుషులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఎదుకు డబ్బులివ్వాలో అర్థంకావట్లేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – ఆడోతు రవి, లక్ష్మీపురం -
రైలు పట్టాల సమీపంలో మంటలు
● పలు రైళ్ల రాకపోకలకు అంతరాయంమిర్యాలగూడ అర్బన్: రైలు పట్టాల సమీపంలో మంటలు వ్యాపించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కుక్కడం వద్ద చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం వద్ద రైలు పట్టాల సమీపంలో రైతులు ఎండిపోయిన వరి కొయ్యలకు నిప్పుపెట్టడంతో మంటలు క్రమంగా వ్యాపిస్తూ రైలు పట్టాల వద్దకు వచ్చాయి. దీంతో విషయాన్ని తెలుసుకున్న రైల్వే సిబ్బంది గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. మంటలను ఆర్పిన అనంతరం రైలు బయలుదేరి వెళ్లింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఎస్ఐ పేర్కొన్నారు. నీటి ఎద్దడి రాకుండా చూడాలి కేతేపల్లి: ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ టి.నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కేతేపల్లి, శాలిగౌరారం మండలాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులు, సిబ్బందితో సంయుక్తంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. తాగునీటి ట్యాంకులను నెలలో మూడు సార్లు శుభ్రం చేయించటంతో పాటు, లీకేజీ అయిన పైప్లైన్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ పనులు లేనందున అన్ని గ్రామాల్లో కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డీఎల్పీఓ వెంకటేశ్వర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు బి.శ్రీనివాసరావు, లక్ష్మినారాయణ, ఎంఈఓ నాగయ్య, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు శ్రీనివాస్, మౌనిక, ఐకేపీ ఏపీఎం యాదమ్మ, ఈజీఎస్ ఏపీఓ సురేందర్, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకం, ఆలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజ వాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవంతో పాటు శ్రీస్వామి, అమ్మవారి సేవలను ఊరేగించారు. వైభవంగా ఊంజలి సేవోత్సవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. ఆ తర్వాత ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. -
నా ఇంటిలో గెట్టు పెడుతున్నారు
ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. నా తండ్రి కాలం చేయడంతో ఆ ఇల్లు వారసత్వంగా నాకు వచ్చింది. ఇరవై ఏళ్లుగా ఇంటి పన్ను కడుతూనే ఉన్నా. కానీ, ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి ఆ స్థలం నీకు ఇవ్వాలంటే రూ.70 వేలు ఇవ్వు అని బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన చర్యలు తీసుకోవాలి. – తిప్పన క్రిష్ణారెడ్డి (లక్ష్మీపురం) ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఉపేక్షించం ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయం నా దృష్టికి రాలేదు. లక్ష్మీపురం గ్రామంలో సర్వే నంబర్ 437లో ఉన్న 4.24 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని 20 మంది లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారానే ఆ భూమిని పంపిణీ చేస్తాం. కబ్జాలకు పాల్పడితే రెవెన్యూ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రావు, ఆర్డీఓ, మిర్యాలగూడ -
రెండో రోజూ స్వల్పమే..
నల్లగొండ: నల్లగొండ లోక్సభ స్థానానికి రెండో రోజైన శుక్రవారం మరో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు నలుగురు అభ్యర్థులు ఆరుసెట్ల నామినేషన్లు దాఖలు చేయగా రెండో రోజు మాత్రం నలుగురు అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో రెండురోజుల్లో ఎనిమిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు నామినేషన్లను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన స్వీకరించారు. నామినేషన్లు సమర్పించింది వీరే.. రెండో రోజు స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో బండారు నాగరాజు, కిన్నెర యాదయ్య ఉన్నారు. అలాగే ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా తలారి రాంబాబు నామినేషన్ సమర్పించారు. మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) అభ్యర్ధిగా వసుకుల మట్టయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి తరఫున ఒక నామినేషన్ సెట్ దాఖలు కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఒకటి, ఇద్దరు రెండు సెట్ల చొప్పున, ప్రజావాణి పార్టీ, సోషలిస్టు పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఒక్కొక్కరు ఒక్కో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి ఎంపీ స్థానానికీ అంతంతే.. సాక్షి, యాదాద్రి: లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భువనగిరి స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్, బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్ చందునాయక్, రేకల సైదులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. మొదటి, రెండో రోజు కలిపి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు వేశారు. అట్టహాసంగా సీపీఎం అభ్యర్థి నామినేషన్ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జహంగీర్ వెంట సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండమడుగు నర్సింహ ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే జన సమీకరణ చేయకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్ వేశారు. నల్లగొండ లోక్సభ స్థానానికి ఎనిమిది నామినేషన్లు రెండు రోజులు నలుగురు అభ్యర్థుల చొప్పున దాఖలు మొత్త పది సెట్ల నామినేషన్లు
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement