పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తాం | jakkampudi vijayalakshmi takes on east godavari district police | Sakshi
Sakshi News home page

పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తాం

Aug 29 2015 3:03 PM | Updated on May 29 2018 2:42 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ ఆరోపించారు.

రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ ఆరోపించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో  జక్కంపూడి విజయలక్ష్మీ మాట్లాడుతూ... మహిళనని కూడా చూడకుండా పోలీసులు అగౌరవంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రశాంతంగా బంద్ చేస్తున్న తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement