హెచ్చెల్సీలో పెరిగిన నీటి ఉధృతి | Increased water intensity hlc | Sakshi
Sakshi News home page

హెచ్చెల్సీలో పెరిగిన నీటి ఉధృతి

Aug 9 2016 12:27 AM | Updated on Sep 4 2017 8:25 AM

పీఏబీఆర్‌కు విడుదల చేసిన తుంగభద్ర జలాలు

పీఏబీఆర్‌కు విడుదల చేసిన తుంగభద్ర జలాలు

పెన్నహోబిళం బ్యాలె న్సింగ్‌ రిజర్వాయర్(పీఏబీఆర్‌) కు 1150 క్యూసెక్కులు, మిడ్‌ పెన్నార్‌ డ్యాంకు 400 క్యూసెక్కుల నీటిని అధికారులు మళ్ళించారు.

ఉరవకొండ :
మండలంలోని మోపిడి గ్రామం వద్ద ఉన్న లింక్‌ చానల్‌ నుంచి పెన్నహోబిళం బ్యాలె న్సింగ్‌ రిజర్వాయర్(పీఏబీఆర్‌) కు 1150 క్యూసెక్కులు, మిడ్‌ పెన్నార్‌ డ్యాంకు 400 క్యూసెక్కుల నీటిని అధికారులు మళ్ళించారు. గత వారం రోజుల నుంచి కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర ఎగువ కాలువకు నీటి ఉధృతి పెరిగింది. నింబగల్లు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద హెచ్చెల్సీ నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతుండటంతో అధికారులు నీటిని ఎక్కువ శాతం జలాశయాలకు మళ్లిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement