ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా ఽఎస్పీ రవికృష్ణ అన్నారు.
నిబంధనలు పాటించకపోతే చర్యలు
Nov 24 2016 12:09 AM | Updated on Sep 4 2017 8:55 PM
నూనెపల్లె: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా ఽఎస్పీ రవికృష్ణ అన్నారు. నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. త్వరలో ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ హరినాథ్రెడ్డి, సీఐలు శ్రీనివాసరెడ్డి, ప్రతాప్ రెడ్డి ఉన్నారు.
Advertisement
Advertisement