16న జిల్లాకు ఉద్యానశాఖ కమిషనర్‌ | Sakshi
Sakshi News home page

16న జిల్లాకు ఉద్యానశాఖ కమిషనర్‌

Published Sat, Feb 4 2017 11:59 PM

horticulture commisioner arrived on 16

అనంతపురం అగ్రికల్చర్‌ : ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి ఈనెల 16న జిల్లాకు వస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బీఎస్‌ సుబ్బరాయుడు తెలిపారు. స్థానిక ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో  రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో (ఎఫ్‌పీఓ) జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారన్నారు. ఇందులో రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎఫ్‌పీఓ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రైతు సంఘాల గుర్తింపు, వాటి పనితీరు, సాధించిన ఫలితాలు, బిజినెస్‌ యాక్షన్‌ ప్లాన్, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తారని తెలిపారు. 

Advertisement
Advertisement