
హెల్మెట్ తప్పనిసరి..
వరంగల్ నగరంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 28న నిర్వహించిన ‘మీ క్షేమం’ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, అందులో పలువురు చేసిన సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.
- దశలవారీగా ద్విచక్ర వాహనదారులపై ఒత్తిడి
- అవగాహనతోనే లక్ష్య సాధనకు ప్రయత్నం
- ఆరునెలల్లో అందరూ వాడేలా కృషి
వరంగల్ : నగరంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 28న నిర్వహించిన ‘మీ క్షేమం’ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, అందులో పలువురు చేసిన సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. శుక్రవారం కమిషనరేట్లో ఆయన మాట్లాడుతూ.. హెల్మట్ల వాడకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. హెల్మెట్లు లేని వారి నుంచి ఫైన్ వసూలు చేయడం వల్ల లక్ష్యం సాధించడం కష్టమని పలువురు అభిప్రాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకు సుమారు 150 మంది నుంచి ‘హెల్మెట్’ ఫైన్లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఫైన్ వేయకుండా వారిలో పరివర్తన తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మొదటగా పోలీస్ సిబ్బంది హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు.