► వచ్చే ఎన్నికల్లో చోడవరం నుంచి పోటీ చేస్తా
► బాంబు పేల్చిన మంత్రి గంటా తనయుడు
► ఇక్కడే రాజకీయం చేస్తానని ఎమ్మెల్యే రాజు కౌంటర్
► రవితేజ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం
► గంటాకు ప్రత్యేక వర్గం ఉండటంతో లోలోన కలవరం
► అధికార టీడీపీలో సరికొత్త రాజకీయం
సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మంత్రి గంటా తనయుడు రవితేజ రాజకీయ వ్యాఖ్యలు.. దానికి చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఇచ్చిన కౌంటర్ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. మంత్రి గంటాను ఇరకాటంలోకి నెట్టాయి.. చోడవరం నియోజకవర్గంలో చిచ్చు రగిల్చాయి.
సాక్షి, విశాఖపట్నం: ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది అధికార టీడీపీలో సీట్ల గోల. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే సమయమున్నా.. ఆ సీటు నాది.. ఈ సీటు నాది అంటూ ఇప్పటినుంచే నేతలు, వారి వారసులు కర్చీఫ్లు వేసేస్తున్నారు. తెరంగేట్రం చేసి సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వారసుడు రవితేజ.. అక్కడితో ఆగకుండా రాజకీయాల్లోకి వస్తున్నట్టు చేసిన ప్రకటన అధికార పార్టీలో చిచ్చు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన మీడియా ముందే బయటపడటంతో చోడవరం టీడీపీలో ముసలం ఏర్పడింది. గతంలో గంటా చోడవరం ఎమ్మెల్యేగా ఉండటం.. ఆయనకంటూ అనుచర వర్గం ఉండడంతో.. సిటింగ్ టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు వర్గీయుల్లో కలవరం మొదలైంది.ఎవరికి టికెట్ ఇచ్చినా నాకు అభ్యంతరం లేదని ఎమ్మెల్యే రాజు పైకి చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆర్నెల్ల క్రితం తండ్రి
సరిగ్గా ఆర్నెల్ల క్రితం గౌరీ మహోత్సవాల సందర్భంగా అనకాపల్లి వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో తాను అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తావిచ్చాయి. ఎంపీగా పీలా గోవింద్.. ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తామని ఎంపీ అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ‘గతంలో ఇక్కడ నుంచే పోటీ చేశా? కాబట్టి మరోసారి ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకుంటున్నా’ అని మంత్రి గంటా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు మింగుడుపడని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్ ‘అబ్బే అదేం లేదు.. మళ్లీ నేనే ఇక్కడి నుంచి పోటీ చేస్తాను’ అని కౌంటర్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఇప్పుడు తనయుడు..
తాను నటించిన జయదేవ్ చిత్రం విజయాన్ని కాంక్షిస్తూ చోడవరంలోని స్వయం భూ వినాయకుని ఆలయంలో గురువారం పార్టీ నేతలతో కలిసి రవితేజ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే మీడియాతో చిత్ర విశేషాలు చెబుతూ.. తన రాజకీయ ఆకాంక్షను కూడా బయటపెట్టేశారు. ‘నా తండ్రిని ఆదరించిన చోడవరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. స్వయంభూ వినాయకుని సన్ని« దిలో వెల్లడించినందున రవితేజ ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుందని పక్కనే ఉన్న పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. గతంలో చోడవరం ఎమ్మెల్యేగా పని చేయడంతో గంటా శ్రీనివాసరావుకు ఇక్కడ ప్రత్యేకంగా అనుచరవర్గం ఉంది. రవి వ్యాఖ్యలు వీరిలో ఉత్సాహాన్ని నింపగా.. సిటింగ్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు వర్గీయుల్లో అలజడి, ఆగ్రహం రేపాయి. ఆయన నటించిన సినిమా ఇంకా విడుదలే కాలేదు. అప్పుడే తానేదో గొప్ప హీరోనైనట్టు.. ఆ దన్నుతో రాజకీయాల్లో రాణించేస్తానని భ్రమపడుతున్నారని మండిపడుతున్నారు. కాగా దీనిపై ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు చోడవరంలోనే రాజకీయాలు చేస్తానని నర్మగర్భంగా తన అంతరంగాన్ని వెల్లడించడం.. టీడీపీలో వేడి పుట్టించింది.
‘రాజకీయాల్లోకి వస్తా.. తలరాత బాగుంటే వచ్చే ఎన్నికల్లోనే బరిలోకి దిగుతా. నాకు ఎంతో ఇష్టమైన చోడవరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. నాన్న లాగే నన్ను ఆదరిస్తారన్న ఆశపడుతున్నా.’ – రవితేజ, మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు
చోడవరం వదిలిపోయే ప్రసక్తే లేదు
నేను పుట్టింది.. పెరిగింది.. రాజకీయాలు చేస్తున్నది.. అంతా చోడవరంలోనే. మళ్లీ టికెట్ ఇస్తే ఇక్కడే పోటీ చేస్తా. కాదని ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు. నేను మాత్రం ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తా. –కేఎస్ఎన్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే చోడవరం
టీడీపీకి సన్స్ట్రోక్
Published Fri, Jun 30 2017 1:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement