కొనసాగుతున్న ఫుట్‌బాల్‌ లీగ్‌ | football league in gooty | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఫుట్‌బాల్‌ లీగ్‌

Jan 8 2017 10:56 PM | Updated on Oct 2 2018 8:39 PM

జిల్లా వ్యాప్తంగా ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫుట్‌బాల్‌ లీగ్‌ క్రీడా పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : జిల్లా వ్యాప్తంగా ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫుట్‌బాల్‌ లీగ్‌ క్రీడా పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గుత్తిలోని ఫుట్‌బాల్‌ క్రీడా మైదానంలో ఆదివారం గుత్తి, కళ్యాణదుర్గం జట్లు తలపడ్డాయి. అండర్‌–13, 15 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అండర్‌–13 విభాగంలో గుత్తి జట్టు కళ్యాణదుర్గం జట్టుపై 7–0 తేడాతో విజయం సాధించింది.

జట్టులో సుభాష్‌–6, కిరణ్‌–1 గోల్స్‌ సాధించారు. అండర్‌–15 విభాగంలో గుత్తి జట్టు కళ్యాణదుర్గం జట్టు పై 5–0 తేడాతో గెలిచింది. జట్టులో రంగ–3, సాయి–2 గోల్స్‌ సాధించారు. ఈ నెల 11 నుంచి నగరంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాపోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నాగరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement