అండర్‌–14 రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు ఐదుగురు ఎంపిక | five select to under - 14 state cricket team | Sakshi
Sakshi News home page

అండర్‌–14 రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు ఐదుగురు ఎంపిక

Nov 26 2016 11:36 PM | Updated on Sep 4 2017 9:12 PM

ఆంధ్ర క్రికెట్‌ సంఘం అండర్‌–14 బాలుర జట్టుకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి బీఆర్‌ ప్రసన్న తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఆంధ్ర క్రికెట్‌ సంఘం అండర్‌–14 బాలుర జట్టుకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి బీఆర్‌ ప్రసన్న తెలిపారు. సౌత్‌ ఇండియా అండర్‌–14 టోర్నీలో పాల్గోనే ఆంధ్ర అండర్‌–14 జట్టులో జిల్లాకు చెందిన దత్తారెడ్డి, అర్జున్‌ టెండూల్కర్, శ్రీయాస్, ప్రశాంత్‌రెడ్డి, మహమ్మద్‌ కామిల్‌లు ఎంపికయ్యారన్నారు. జట్టుకు స్టాండ్‌బైగా ఆనంద్‌ ఎంపికయ్యాడన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్‌ 4న మంగళగిరి క్రికెట్‌ అకాడమీలో రిపోర్టు చేసుకోవాలన్నారు.  డిసెంబర్‌  5 నుంచి 20 వరకు శిక్షణ ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement