breaking news
state cricket team
-
అండర్–14 రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఐదుగురు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ సంఘం అండర్–14 బాలుర జట్టుకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. సౌత్ ఇండియా అండర్–14 టోర్నీలో పాల్గోనే ఆంధ్ర అండర్–14 జట్టులో జిల్లాకు చెందిన దత్తారెడ్డి, అర్జున్ టెండూల్కర్, శ్రీయాస్, ప్రశాంత్రెడ్డి, మహమ్మద్ కామిల్లు ఎంపికయ్యారన్నారు. జట్టుకు స్టాండ్బైగా ఆనంద్ ఎంపికయ్యాడన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 4న మంగళగిరి క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 5 నుంచి 20 వరకు శిక్షణ ఉంటుందన్నారు. -
ఏసీఏ అండర్–23 జట్టుకు ప్రణీత్ ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రా క్రికెట్ జట్టుకు శ్రీకాకుళానికి చెందిన ఎం.ప్రణీత్ ఎంపికయ్యాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అండర్–23 క్రికెట్ జట్టు జాబితాను మంగళవారం వెల్లడించింది. 14 మంది సభ్యులతో కూడిన తుది జట్టులో ప్రణీత్ చోటు సంపాదించాడు. త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మక అంతర్రాష్ట్రాల అండర్–23 క్రికెట్ టోర్నీలో ఈ లెఫ్ట్హ్యాండ్ బ్యాట్స్మ్యాన్ ఆంధ్రా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే పలు వయో విభాగాల్లో ఆంధ్రా జట్టు తరుఫున ప్రాతినిధ్యం వహించిన ప్రణీత్.. గత సీజన్లో అంతర్జోనల్, రాష్ట్రపోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో రాణించాడు. దీంతో అండర్–23 జట్టుకు ఏసీఏ ఎంపికచేసింది. ప్రణీత్ ఆంధ్రా జట్టుకు ఎంపిక కావడం పట్ల ఏసీఏ నార్త్జోన్ క్రికెట్ కార్యదర్శి, జిల్లా క్రికెట్ ఆపరేషన్స్ ఇన్చార్జి జి.వి.సన్యాసినాయుడు, తండ్రి ఎం.యోగేశ్వరరావు, స్థానిక కోచ్లు ఆర్సీరెడ్డి, సుదర్శన్, వరహాలు, సీనియర్ క్రికెటర్లు, కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే ఇదే అండర్–23 క్రికెట్ జట్టులో స్టాండ్బైగా జిల్లాకు చెందిన ఎల్.రాజశేఖర్ను పరిగణలోకి తీసుకున్నారు.